India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దామగుండం రాడార్ స్టేషన్పై పిల్లచేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తిడితే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. ఆయనకు కష్టమంటే తెలియదని చెప్పుకొచ్చారు. రేవంత్ కష్టపడి ఎదిగారని, ప్రజల బాధలు ఆయనకు తెలుసన్నారు. కేసీఆర్ సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారని జగ్గారెడ్డి అన్నారు.
మార్కెట్లో బ్రోకలీ కనిపించినా రెగ్యులర్ వంటకం కాదని చాలామంది చూసీచూడనట్లు వెళ్లిపోతుంటారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తరహాలోనే బ్రోకలీ కూడా క్రూసిఫరస్ ఆకుకూర. ఇందులో క్యాలీఫ్లవర్లో ఉన్న ‘క్యాన్సర్ను తగ్గించే’ లక్షణాలుంటాయి. బ్రోకలీ మొలకల్లో సల్ఫారఫేన్ ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ కారకం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో ఇది తీసుకున్నాక అసాధారణ మార్పు కన్పించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023లో రోడ్డు ప్రమాదాల్లో 76వేల మంది బైకర్లే మరణించారు. ఇందులో 70శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు డేటా చెబుతోంది. ప్రస్తుతం హెల్మెట్స్, ABSలు ప్రమాదాలను నివారిస్తాయని రోడ్ సేఫ్టీ నిపుణులు సూచిస్తున్నారు. ఇకనైనా బైకర్లతో పాటు పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
TG: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు పర్యవేక్షించిన గ్రూప్ క్వాంటెలాను ప్రభుత్వం పక్కన పెట్టింది. తక్కువ వ్యయంతో నిర్వహణకు ముందుకు రావడంతో ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. NIC మూడేళ్ల పాటు నిర్వహణ చూడనుంది.
ఝార్ఖండ్ BJPలో అసంతృప్తి జ్వాలలు లేచాయి. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని ముగ్గురు మాజీ MLAలు సహా కొందరు నేతలు అధికార JMMలో చేరారు. 66 మందితో BJP తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో మాజీ CM చంపై సోరెన్, బాబులాల్ సోరెన్ సహా సగానికి పైగా వలస నేతలే ఉన్నారు. అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద పార్టీలకు ఇలాంటివి సహజమేనని పోల్స్ కో ఇన్ఛార్జ్ హిమంత బిశ్వశర్మ అన్నారు.
AP: విజయవాడ వరద సాయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రం కానుందని పేర్కొన్నారు. దీని కోసం 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేసింది. ఆమె తండ్రి ఇవాన్ క్లబ్ ప్రెసిడెన్షియల్ హాల్లో మత మార్పిళ్లను ప్రోత్సహిస్తుండటమే ఇందుకు కారణం. ‘Brother Manuel Ministries’ తరఫున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించారని క్లబ్ మెంబర్ శివ మల్హోత్ర అన్నారు. ‘దేశవ్యాప్తంగా కన్వర్షన్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడిది మా వద్దే జరిగింది. క్లబ్లో ఇలాంటివి నిషేధం’ అని తెలిపారు.
AP: రాబోయే రోజుల్లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ కానున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్ 2024లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు అది దేశంలోనే గొప్ప నగరంగా ఉందన్నారు. 1995లోనే ఐటీ గురించి ఆలోచించి, అనేక కంపెనీలను తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో డేటానే కీలకమని, ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కాదని, ఎంత డేటా ఉందనేది గొప్పగా చూస్తారని చెప్పారు.
APలో ఇవాళ్టి నుంచి ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్, డెమోగ్రాఫిక్ అప్డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.
AP: వచ్చే 20 ఏళ్లలో దేశంలో 200కు పైగా ఎయిర్ పోర్టులు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్-2024లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఎయిర్ పోర్టుల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఐడియాలజీని అందుకోవడం తనకు కూడా కష్టంగా ఉందని చెప్పారు. విజన్ 2020తో పెను మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. HYDను ప్రపంచ స్థాయి నగరంగా మార్చారన్నారు.
Sorry, no posts matched your criteria.