India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశ వ్యాప్తంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. SEPతో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4 కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లు కాగా 38% వృద్ధి నమోదైంది. అయితే HYD, బెంగళూరులో మాత్రం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలతో లగ్జరీ ఇళ్లపై పెట్టుబడులు పెడుతున్నారని CBRE తెలిపింది.
చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ తన బుక్ ‘విట్నెస్’లో వెల్లడించారు. ‘ట్యూషన్ టీచర్ వేధించేవాడు. కొన్నిసార్లు నన్ను తాకేందుకు ప్రయత్నించేవాడు. దీంతో క్లాస్లకు వెళ్లేందుకు భయపడేదాన్ని. ఇది నా తప్పుగా భావించి పేరెంట్స్కు చెప్పలేకపోయా’ అని పేర్కొన్నారు. రెజ్లింగ్లోకి అడుగుపెట్టాక కూడా ఎప్పుడు పారిపోవాలనే ఆలోచించేదాన్నని రాసుకొచ్చారు.
TG: దేశంలో పవర్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిగుమతులు తగ్గించుకుంటూ దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా మరింత కృషి జరగాలన్నారు. అవసరమైన చోట నిబంధనలు మార్చడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికులు, గనుల కోసం భూములు వదిలి వెళ్తున్న వారి సంక్షేమం కోసం MDOలు ఆలోచించాలని సూచించారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
సింగర్, పాటల రచయితగా సంగీత ప్రియులకు దగ్గరైన అనన్య శ్రీ బిర్లా అత్యంత ధనవంతురాలని చాలా మందికి తెలియదు. బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తెనే ఈ అనన్య బిర్లా. ఆమె 2016లో సంగీతరంగ ప్రవేశం చేసి అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 28 ఏళ్ల వయసులోనే ఆమె ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె నెట్వర్త్ $13 బిలియన్లు (రూ.లక్ష కోట్ల పైనే).
AP: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన జాతీయ జెండాను రూపొందించి జాతికి అందించారని కొనియాడారు.
TG: నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపునకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లు కావాలని ఆయా కాలేజీలు JNTUని కోరాయి. అందుకు జేఎన్టీయూ అంగీకరించకపోవడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన హైకోర్టు నాలుగు కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయనుంది.
బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష ముగిసింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన తమ సహచరురాలికి న్యాయం చేయాలంటూ 16 రోజులుగా వారు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. వైద్యులపై దాడి, వైద్యులకు రక్షణ, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వంటి అంశాలపై మమతా వారికి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలను జూడాలు విరమించారు.
1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1996: ఆర్యసమాజ స్థాపకుడు పండిత గోపదేవ్ మరణం
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: నటుడు జీ.రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆఫీస్ సిబ్బంది 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ తీసుకున్నందుకు ఏజెంట్ దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీ డెలివరీ బాయ్స్ ప్రవర్తనను మెరుగుపర్చడంపై ఎందుకు ఫోకస్ చేయరు? ఇలా బూతులు తిట్టే హక్కు ఎవరికీ లేదు’ అని పేర్కొన్నారు. దీంతో జొమాటో కేర్ క్షమాపణలు కోరింది. ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
తేది: అక్టోబర్ 22, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:11 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు అసర్: సాయంత్రం 4:13 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 5:50 గంటలకు ఇష: రాత్రి 7.03 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.