news

News April 13, 2025

ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

image

AP: ఇంటర్‌లో <<16068539>>ఫెయిలయ్యామనే<<>> బాధలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ కొండపేటలో చరణ్‌తేజ్‌కు సెకండియర్ ఫిజిక్స్‌లో 10 మార్కులే రావడంతో ఉరివేసుకున్నాడు. ఫస్టియర్‌లో ఫెయిలవడంతో నంద్యాల(D) బండిఆత్మకూరులో చిన్నమస్తాన్, నెల్లూరు(D) చింతారెడ్డిపాలెంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. కర్నూలు(D) ఆదోనిలో 2 సబ్జెక్టులు ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది.

News April 13, 2025

IPL: డేంజర్ జోన్‌లో CSK, MI

image

IPL2025: PBKSపై సంచలన విజయంతో SRH పాయింట్ల పట్టికలో కాస్త ముందుకెళ్లింది. 6 మ్యాచ్‌లలో 2 విజయాలతో ఎనిమిదో స్థానానికి చేరింది. దీంతో తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐదు సార్లు ట్రోఫీ విన్నర్లయిన MI, CSK 9, 10వ స్థానాల్లో నిలిచాయి. రేపు లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఓడితే చెన్నై ఇంటిబాట పట్టడం దాదాపు ఖాయమే. ఇవాళ DCతో మ్యాచ్‌లో MI ఓడిపోతే ప్లేఆఫ్స్ అవకాశం సంక్లిష్టంగా మారుతుంది.

News April 13, 2025

తెలంగాణ కొత్త DGP ఎవరు?

image

TG: ప్రస్తుత DGP జితేందర్ ఈ ఏడాది SEPలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం 30ఏళ్ల సర్వీసు పూర్తయిన ఏడుగురి పేర్లను పరిశీలిస్తోంది. వారిలో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, షికాగోయల్ ముందువరుసలో ఉన్నారు. ఆ పేర్ల నుంచి ముగ్గురిని UPSC ఎంపిక చేయనుండగా, అందులో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.

News April 13, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

బర్డ్ ఫ్లూ భయం వీడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వినియోగం మళ్లీ పెరుగుతోంది. దీంతో రేట్లు కూడా స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలో కేజీ కోడి మాంసం ధర స్కిన్‌లెస్ రూ.240-260 వరకు పలుకుతోంది. అంతకుముందు ఇది రూ.230కే పరిమితం అయింది. అటు ఏపీలో కేజీ రూ.270-300 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రేట్లలో హెచ్చుతగ్గులున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?

News April 13, 2025

ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్

image

TG: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. వడగళ్ల వానలతో ఉత్తర తెలంగాణలో భారీ నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే వివరాలు సేకరించాలంది. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.40వేలు ఇవ్వాలని కోరింది. కాగా నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

News April 13, 2025

గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులకు చట్ట హోదా..దేశంలోనే తొలిసారి

image

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అనుమతి లేకుండానే 10బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో గవర్నర్ ప్రమేయం లేకుండానే బిల్లులకు చట్ట హోదా కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను నెలలోగా అనుమతించకపోతే అది చట్టరూపం దాల్చినట్లు భావించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

News April 13, 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్స్!

image

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్స్ అమలయ్యే అవకాశముంది. వన్డేల్లో పదేళ్ల నుంచి అమల్లో ఉన్న 2 కొత్త బంతుల విధానాన్ని మార్చాలని గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ఒకప్పటిలా ఒకే బంతి వాడితే పాతబడ్డాక రివర్స్ స్వింగ్, స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. WTCలో భారీ తేడాతో గెలిస్తే, పెద్ద జట్లను చిన్నవి ఓడిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలంది. త్వరలో ICC తుది నిర్ణయం తీసుకోనుంది.

News April 13, 2025

తెలుగు విద్యార్థికి 300కు 300 మార్కులు?

image

ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన JEE మెయిన్ తుది విడత పరీక్షల <>ప్రైమరీ కీ<<>> విడుదలైంది. ఏవైనా అభ్యంతరాలుంటే ఇవాళ రాత్రి 11.50 గంటల్లోపు ఆన్‌లైన్ ద్వారా పంపొచ్చు. పరిశీలన అనంతరం ఫైనల్ కీని రిలీజ్ చేస్తారు. ప్రాథమిక కీ ప్రకారం HYDలో చదువుతున్న అజయ్‌రెడ్డి 300కు 300 మార్కులు సాధించినట్లు సమాచారం. JANలో జరిగిన తొలి విడత ఎగ్జామ్‌లో ఇతను 99.966 పర్సంటైల్ స్కోర్ పొందాడు. అజయ్ సొంతూరు ఏపీలోని నంద్యాల(D) తాటిపాడు.

News April 13, 2025

ఇంటర్ ఫెయిల్ అవుతానేమోననే భయంతో..

image

TG: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ప్రణీత(18) అనే అమ్మాయి బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని కొన్నిరోజులుగా కూతురు ఆవేదనతో ఉందని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2025

శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్

image

SRHపై 245 పరుగులు చేసినా PBKS నిన్న ఉప్పల్‌‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఓటమితో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. మూడు సార్లు 200+ రన్స్ చేసి డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయిన కెప్టెన్‌గా చెన్నై కెప్టెన్ ధోనీ సరసన తొలి స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో డుప్లెసిస్, ధావన్, శాంసన్, కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. నిన్న 18.3ఓవర్లలోనే SRH 245రన్స్‌ను ఛేజ్ చేసింది.