news

News April 13, 2025

ఏడాది చదువుకు దూరమైన బాలిక నేడు జిల్లా టాపర్

image

AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్‌ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. 2021-22లో టెన్త్‌లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్‌లో 420, సెకండియర్‌లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.

News April 13, 2025

అభిషేక్ వద్ద అప్పటి నుంచే ఆ నోట్ ఉంది: హెడ్

image

PBKSతో నిన్నటి మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 40 బంతుల్లోనే శతకం బాదిన క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి <<16080847>>ఓ నోట్<<>> చూపించారు. దానిపై ఆ జట్టు మరో ఓపెనర్ హెడ్ స్పందించారు. ‘అభిషేక్ జేబులో ఆ నోట్ 6 మ్యాచ్‌ల నుంచి అలాగే ఉంది. ఉప్పల్‌లో అది బయటకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు, అభిషేక్ 55 బంతుల్లోనే 141 రన్స్ బాది మ్యాచ్‌ను వన్ సైడ్ చేశారు.

News April 13, 2025

892 మార్కులొచ్చినా.. ఇంటర్ విద్యార్థిని ఫెయిల్

image

AP: విజయవాడ పటమటకు చెందిన ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరికి నిన్న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 892 మార్కులొచ్చినా ఫెయిలైంది. ఆమెకు సంస్కృతంలో 98, మ్యాథ్స్ 2Aలో 73, 2Bలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60, 2 ప్రాక్టికల్స్‌లో 60 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో 5 మార్కులే వచ్చినట్లు మార్కుల లిస్టులో చూపిస్తోంది. కష్టపడి చదివినా ఇంగ్లిషులో 5 మార్కులే రావడం పట్ల విద్యార్థిని కన్నీరుమున్నీరయ్యారు.

News April 13, 2025

కృష్ణా జలాల పంపిణీపై 15 నుంచి విచారణ

image

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫున ఇప్పటికే 2 దఫాలు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మరో 2 లేదా 3 సార్లు వాదించనున్నారు. ఆ తర్వాత AP తరఫున వాదనలు ప్రారంభం అవుతాయి. ఈ ట్రైబ్యునల్ విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.

News April 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి హాల్ టికెట్స్

image

TG: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 6,835 సీట్లకు గానూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్‌సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.

News April 13, 2025

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధిపై ప్రణాళికకు CM ఆదేశం

image

AP: ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను సిద్ధం చేయాలని సమీక్షలో చెప్పారన్నారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి బోటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారని వివరించారు. అలాగే, నిత్యాన్నదానం కోసం భవనం నిర్మించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

News April 13, 2025

ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

image

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 13, 2025

ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

image

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 13, 2025

మటన్‌ను ఎంత తినాలి?

image

నాన్‌వెజ్ ప్రియులు మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.

News April 13, 2025

2026 ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే: అన్నామలై

image

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా AIADMK, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తాను పార్టీ కోసం పని చేసే సాధారణ కార్యకర్తనని, తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ఆయన వివరించారు.