India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచి మనసు చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద దళిత యువతి సుస్మిత MBBS చదువుకు భరోసానిచ్చారు. ఆమె కల్వకుర్తి గురుకులంలో చదివి, ఉస్మానియా కాలేజీలో MBSS సీటు సాధించి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా ఆయన స్పందించారు. తాను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.
AP: రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరలకే వంట నూనెలను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటర్ రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124కే ఇస్తామని చెప్పారు. అలాగే తక్కువ ధరకే కందిపప్పు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలో వంటనూనెల దిగుమతిదారులతో మంత్రి భేటీ అయ్యారు. మరింత ఎక్కువగా వంటనూనెలను అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు.
TG: గ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇంకా తుది జాబితాను ప్రకటించకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ను కలిశారు. ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన KTR దీనిపై ఉద్యమిస్తామని వారికి హామీ ఇచ్చారు.
రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. UAE మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు 190 మంది(చెరో 95 మంది) యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని రష్యన్ రక్షణ శాఖ ధ్రువీకరించగా, కీవ్ ఇంకా స్పందించలేదు. గత నెలలో జరిగిన డీల్లో 206 మంది స్వదేశాలకు చేరుకున్నారు. అలాగే గత శుక్రవారం 501 మృతదేహాలను ఉక్రెయిన్, 89 బాడీలను రష్యా మార్పిడి చేసుకున్నాయి.
AP: ఉచిత DSC కోచింగ్కు హాజరయ్యే SC, ST అభ్యర్థులు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 27న దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 3 నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే అభ్యర్థుల కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక గదులు, కాన్ఫరెన్స్ హాల్, తరగతి గదులు, రీడింగ్ రూమ్ ఉన్నాయి.
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్కు వచ్చారు. ప్రస్తుతం సర్ఫరాజ్తో కలిసి ఆయన ఇన్నింగ్స్ను పునర్నిర్మించే పనిలో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో కీపింగ్ చేస్తుండగా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మోకాలివాపుతో ఆయన నిన్న ఫీల్డింగ్కు రాలేదు. దీంతో బ్యాటింగ్కు కూడా దిగుతారో లేదోనని అనుమానాలు తలెత్తాయి. ఎట్టకేలకు బ్యాట్ పట్టారు.
TG: హైడ్రా ఎఫెక్ట్తో GHMC పరిధిలో నిర్మాణాలకు బ్రేక్ పడిందని ఓ మీడియాలో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందించారు. ‘RR Tax కట్టాలి కదా? ఢిల్లీకి మన చిట్టి కప్పం కట్టకపోతే పదవి మటాష్ కదా! మనమే ఏరికోరి తెచ్చుకున్న మార్పు కదా’ అంటూ సీఎం రేవంత్పై Xలో సెటైర్లు వేశారు.
ఢిల్లీ నుంచి లండన్కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్కు బయల్దేరుతుందని తెలిపింది.
విక్టరీ వెంకటేశ్, తమిళ్ డైరెక్టర్ టీఎన్ సంతోషన్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్పై హీరో నితిన్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని సమాచారం.
HYD ప్రకాశ్నగర్లో బాలయ్య అనే వ్యక్తి కుళ్లిన చికెన్ అమ్ముతున్న కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి చాలా తక్కువ ధరకు చికెన్ను దిగుమతి చేసుకుంటున్నాడు. జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్కు కేజీ చికెన్ను రూ.30-50కే విక్రయించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 10 నుంచి నెల రోజుల నాటి చికెన్ అమ్ముతున్నట్లు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.