India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గ్రూప్-1 మెయిన్స్ రద్దు కుదరదని తీర్పిచ్చిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నోటిఫికేషన్ జారీనే చట్టవిరుద్ధమన్నప్పుడు ప్రిలిమ్స్ రాయకముందు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు. ఇప్పటికే రెండుసార్లు రద్దయ్యాయి. మొదటిసారి 5 లక్షల మంది రాస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షలకు వచ్చింది. మళ్లీ రద్దంటే కుదరదు. ఇంకా ఎన్నేళ్లు ఇలా? వీటిని అనుమతిస్తే కొత్త అభ్యంతరాలతో మరికొందరు వస్తారు’ అని ఘాటుగా స్పందించింది.
TG: గ్రూప్-1 మెయిన్స్ రద్దు కుదరదని తీర్పిచ్చిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నోటిఫికేషన్ జారీనే చట్టవిరుద్ధమన్నప్పుడు ప్రిలిమ్స్ రాయకముందు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు. ఇప్పటికే రెండుసార్లు రద్దయ్యాయి. మొదటిసారి 5 లక్షల మంది రాస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షలకు వచ్చింది. మళ్లీ రద్దంటే కుదరదు. ఇంకా ఎన్నేళ్లు ఇలా? వీటిని అనుమతిస్తే కొత్త అభ్యంతరాలతో మరికొందరు వస్తారు’ అని ఘాటుగా స్పందించింది.
AP: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు, 24న రూ.300 దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 24న మధ్యాహ్నం 3 గంటలకు గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.
APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఐదారు నెలల్లో పూర్తి చేస్తామని DGP ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా ఈ పోస్టులకు గత ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. అయితే హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ పేలవ ప్రదర్శన చేసినా రెండో ఇన్నింగ్స్లో గొప్పగానే పుంజుకుంది. ఇదే నిలకడ ఈ రోజు మొత్తం కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. పంత్, కేఎల్, సర్ఫ్రాజ్ కీలకంగా మారనున్నారు. కనీసం 300 నుంచి 400 పరుగులు చేస్తేనే ప్రత్యర్థిపై పోరాడే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే కనీసం మ్యాచ్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ పరుగులకే భారత్ చాప చుట్టేస్తే ఓటమి ఖాయం.
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో సినీ నటి ఖుష్బూను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి ఆమె దీటైన పోటీ ఇస్తుందనే భావన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆమెతోపాటు ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
AP: TDP ప్రజాప్రతినిధులతో CM చంద్రబాబు సమావేశంలో పలువురు MLAలు జనసేన తీరుపై ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో జనసేనతో సమస్యలు వస్తున్నాయని, ఆ పార్టీ నేతలు సహకరించడం లేదని గౌతు శిరీషతోపాటు ముగ్గురు MLAలు ప్రస్తావించారు. అలాంటి సమస్యలను TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తుందని CM చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
TG: ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గత కౌన్సెలింగ్లలో సీట్లు పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం <
AP: బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కాగా ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
హమాస్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వర్ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. దీంతో హమాస్ను ఎవరు ముందుకు నడిపిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మహ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ తర్వాతి వరుసలో సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్, హమాస్ మిలటరీ వింగ్ కమాండర్ మహ్మద్ దీఫ్, హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యులు మౌసా అబు మార్జౌక్, ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మెషాల్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.