India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగారు. ఆయన 13 ఫోర్లు, 4 సిక్సులతో 134 పరుగులు చేశారు. దీంతో 2012 తర్వాత భారత గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా రచిన్ చరిత్ర సృష్టించారు. ఇన్నింగ్స్ పూర్తయ్యాక రచిన్కు స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్తో అభినందించారు. 2012లో ఇదే స్టేడియంలో రాస్ టేలర్(113) సెంచరీ చేశారు.
TG: ప్రజెంటేషన్ పేరుతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. నిన్నటి సమావేశంలో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
భారత పాస్పోర్టు కలిగిన వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే ఆ దేశం వెళ్లిన తర్వాత తొలి 14 రోజులకు వీసా తీసుకోవచ్చు. ఆ తర్వాత పొడిగించుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం. USA వీసా, రెసిడెన్స్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డ్, ఈయూ-యూకే నుంచి వీసా, రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికే ఈ సౌకర్యాన్ని యూఏఈ కల్పించింది.
ఎల్లుండి(ఆదివారం) అట్లతద్ది. ఇది మహిళల పండుగ. ముఖ్యంగా పెళ్లికాని యువతులు మంచి భాగస్వామి రావాలని కోరుతూ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. గౌరీదేవిని పూజించి, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించినట్లు పురాణాల గాథ. అటు పెళ్లయిన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని ఈ వ్రతం చేస్తారు. ఉత్తరాదిలో అట్లతద్దిని కర్వాచౌత్గా జరుపుకుంటారు.
శారీరక శ్రమ లేదని ఆఫీసుల్లో స్టాండింగ్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వీటితోనూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. రోజుకు 2Hrs పైగా నిలబడి పనిచేస్తే వెరికోస్ వీన్స్, నరాల్లో రక్తప్రసరణ తగ్గే జబ్బులు వస్తున్నాయని హెచ్చరించారు. అందుకే మరీ ఎక్కువగా కూర్చోకుండా, నిలబడకుండా ఇంటర్వల్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటి కాలిమీద బరువు పెట్టొద్దని, పోస్చర్ మార్చుకోవాలని అంటున్నారు.
ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. చివరికి లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 24,854 (+104), సెన్సెక్స్ 81,224 (+218) వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు, మెటల్, ఫైనాన్స్, మీడియా షేర్లకు గిరాకీ పెరిగింది. IT షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐచర్ మోటార్స్ టాప్ గెయినర్స్. ఇన్ఫీ, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్.
తల్లిదండ్రులతో కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని TGSRTC ఎండీ సజ్జనార్ అన్నారు. ‘జీవితంలో మనం సాధించేదంతా తల్లిదండ్రుల సపోర్ట్, త్యాగాల వల్లనే అని మరిచిపోకూడదు. ఒకప్పుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన వారిని ఇప్పుడు భారంగా ఎలా చూడగలుగుతున్నారు? ఇది నిజంగా హృదయ విదారకమైనది. అలాంటి వారిని చట్టపరంగా శిక్షించాలి. ఎవరైనా పేరెంట్స్ను వేధిస్తే డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి’ అని తెలిపారు.
భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ టీ బ్రేక్ సమయంలో ఆయన గ్రౌండ్లోకి వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. దీంతో ఆయన రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా నిన్న కాలి <<14382332>>గాయంతో<<>> ఆయన మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే.
NZతో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్సులో భారత జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 35 పరుగులు చేసిన జైస్వాల్ అజాజ్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగారు. అర్ధసెంచరీ చేసి ఊపుమీదున్న కెప్టెన్ రోహిత్ బౌల్డ్ అయ్యారు. దీంతో రోహిత్ నిరాశ చెందగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(21), సర్ఫరాజ్(28) ఉన్నారు. జట్టు స్కోరు 138/2.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లంతా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లను తెలుగు రైట్స్ ఓనర్ నాగవంశీ దుబాయ్కు తీసుకెళ్లారు. అక్కడ వారందరికి మంచి పార్టీ ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
Sorry, no posts matched your criteria.