news

News October 18, 2024

1,690 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!

image

TG: రాష్ట్రంలో 1,690 వైద్య పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో 1,690 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీటికి నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, 2025 మార్చి/ఏప్రిల్‌లో భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటివరకూ కాంట్రాక్టు వైద్యుల నియామకం కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

News October 18, 2024

పాక్ కెప్టెన్‌కు శ్రేయాంక గిఫ్ట్

image

దేశాలు వేరైనా క్రీడాకారులుగా అంతా ఒక్కటే అని భారత్ స్టార్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ నిరూపించారు. ఇటీవల ఉమెన్స్ T20WC మధ్యలో తన తండ్రి చనిపోవడంతో నిరాశలో ఉన్న పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఆమె స్వయంగా గీసిన ఓ చిత్రాన్ని పంపారు. ‘నీకు ఇష్టమైనది చెయ్యి’ అని రాసుకొచ్చారు. ఇందుకు ఫాతిమా ఆమెకు సోషల్ మీడియాలో థాంక్స్ చెప్పారు. దీనికి శ్రేయాంక స్పందిస్తూ.. ‘నీతో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా’నన్నారు.

News October 18, 2024

బర్త్ డే రోజు కేక్ లాగించేస్తున్నారా?

image

కేక్ తింటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. బేకరీల నుంచి తెచ్చుకునే కేక్ కలుషితమయ్యే ఆస్కారం ఉంటుంది. దానిని తింటే డయాబెటిస్, బీపీ, లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ముఖంలో వాపు, అలర్జీ, ఇన్‌ఫెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కేక్ తయారీకి వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్‌కు దారితీస్తాయి. కేక్స్ అతిగా తినకపోవడమే మంచిది.

News October 18, 2024

మధ్యాహ్న భోజనంలో మార్పులు!

image

AP: నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.

News October 18, 2024

కెనడాలో బలమైన భారతీయ సమాజం

image

కెనడాలో 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 18 లక్షల భారత సంతతివారు, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా జీవిస్తున్నారు. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 45 శాతం మంది భారతీయులే. అక్కడి పథకాల్లో ప్రధాన లబ్ధిదారులూ మనవాళ్లే. 2019లో కెనడా వెళ్లిన భారతీయుల సంఖ్య 2.46 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 28 లక్షలకు చేరుకుంది.

News October 18, 2024

శ్వేతపత్రాలపై ఏం చేశారు? నివేదికివ్వండి: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ సీఎం చంద్రబాబు 2 నెలల కిందట పలు రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే ఆయా శాఖలు వాటిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాయో ప్రభుత్వానికి నివేదించలేదు. దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

News October 18, 2024

హరీశ్ రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి హరీశ్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపై మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది. తనకు తెలియకుండా ఇంటిని అమ్మేశారని, అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జంపన ప్రభావతి, తన్నీరు గౌతమ్, తన్నీరు పద్మజారావు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్, గారపాటి నాగరవిపై కేసు నమోదైంది.

News October 18, 2024

‘రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. పోలీసులకు మెసేజ్

image

సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్‌లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘లైట్‌గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

News October 18, 2024

‘OG’ సెట్‌లో సుజీత్, తమన్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా షూటింగ్ సెట్‌లో డైరెక్టర్ సుజీత్‌తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌, DOP రవి కే చంద్రన్ డిస్కస్ చేస్తోన్న ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమయాన్ని బట్టి పవన్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇటు హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది.

News October 18, 2024

PHOTO: బాబు, పవన్‌తో మోదీ

image

హరియాణాలోని చండీగఢ్‌లో నిన్న జరిగిన NDA నేతల మీటింగ్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోదీ, బాబు, పవన్‌లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. మీటింగ్ హాల్‌లో పవన్‌ను చూసిన మోదీ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. పక్కనే బాబు కూడా ఉండగా ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.