India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* TG: మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం: రేవంత్
* గజ్వేల్లో రచ్చబండ.. చర్చకు రావాలని కేసీఆర్కు రేవంత్ సవాల్
* సీఎం రేవంత్ కామెంట్స్పై రేపు మాట్లాడుతా: కేటీఆర్
* AP: జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి: జగన్
* పోలీసు విచారణకు హాజరైన వైసీపీ నేత సజ్జల
* న్యూజిలాండ్తో తొలి టెస్టులో 46 పరుగులకే భారత్ ఆలౌట్
* హరియాణా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
ఈ ఏడాదిలోనే అతి పెద్ద చంద్రుడు ఆకాశంలో శుక్రవారం తెల్లవారుజామున దర్శనమివ్వనున్నాడు. ఈ చంద్రబింబాన్ని ‘హంటర్స్ మూన్’ లేదా సూపర్ మూన్గా చెబుతారు. తెల్లవారుజాము 4.30 గంటలకు చంద్రుడు సాధారణంకంటే 14శాతం పెద్దగా, 30శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడని ఖగోళ పరిశోధకులు తెలిపారు. ఈ ఏడాది సూపర్మూన్స్లో ఇది రెండోది కావడం గమనార్హం.
TG: మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్లో పర్యటిస్తారు. స్థానికంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.
న్యూజిలాండ్తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.
పాకిస్థాన్లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి భారత PM మోదీ వచ్చి ఉంటే బాగుండేదని పాక్ మాజీ PM నవాజ్ షరీఫ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘వారి మంత్రి పర్యటనతోనైనా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని ఆశిస్తున్నాం. మన మధ్య సమస్యల్ని కలిసి పరిష్కరించుకోవాలి. శాంతిచర్చలు కొనసాగాలి. 75 ఏళ్లు ఇలాగే వృథా అయ్యాయి. మరో 75 ఏళ్లు మనం వృథా చేయకూడదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలుండాలి’ అని కోరారు.
AP: చిత్తూరు(D) మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం <<14370148>>కూల్చివేత ఘటనలో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య పోరు తలెత్తింది. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
మహిళల T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు షాకిచ్చింది. 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఓడిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 134/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. చివరి మూడు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ప్రెస్ మీట్లో వాయిదా విషయమై అడిగిన ప్రశ్నకు ఇది సందర్భం కాదని సీఎం దాటవేశారు. మరోవైపు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో వాయిదా పడే అవకాశం లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
TG: రాష్ట్రంలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానం మాదిరే ఒకరికి 6కేజీల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. అటు త్వరలో కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలనే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్, సూపర్ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలు, స్టాల్స్ను ఆయన పరిశీలించారు. సూపర్ మార్కెట్లో కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో ఉల్లి, టమాటా, కందిపప్పు, నూనె అందిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.