news

News April 12, 2025

బెంగాల్‌లో అల్లర్లు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

image

వక్ఫ్ చట్టం సవరించిన నేపథ్యంలో బెంగాల్‌లో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మేం కాదు. మీరు కేంద్రంతోనే తేల్చుకోండి. సవరించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పాం. కాబట్టి అన్ని మతాల ప్రజలు శాంతించండి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ అల్లర్లలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.

News April 12, 2025

CSK మరో చెత్త రికార్డు

image

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.

News April 12, 2025

గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

image

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 12, 2025

EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యం: CEC

image

EVMలను హ్యాక్ చేయవచ్చన్న US జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను CEC జ్ఞానేష్ కుమార్ ఖండించారు. ఇండియాలో వాడే EVMలు వంద శాతం సేఫ్, ట్యాంపర్ ప్రూఫ్ అని స్పష్టం చేశారు. వాటిని ఎలాంటి బ్లూటూత్ పరికరాలతో కనెక్ట్ చేయలేరని, అందుకే ట్యాంపర్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. 5 కోట్ల VVPAT స్లిప్పులు లెక్కించినా.. ఎక్కడా తప్పులు దొర్లలేదని తెలిపారు.

News April 12, 2025

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్

image

AP: వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుందన్నారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేస్తామన్నారు.

News April 12, 2025

UPI పేమెంట్స్ ఫెయిల్.. ‘క్యాష్ ఈజ్ కింగ్’

image

దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్లు ఫెయిల్ కావడంతో జేబులో డబ్బు ఉండటం ఎంత ముఖ్యమో మరోసారి తెలిసి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. క్యాష్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అత్యవసర సమయాల్లో యూపీఐ సేవలను నమ్ముకోలేమని, లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నారు. కష్టకాలంలో ఇది మిమ్మల్ని ఆదుకుంటుందని అంటున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి యూపీఐ సేవలు నిలిచి కస్టమర్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

News April 12, 2025

9,970 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

image

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. టెన్త్‌తోపాటు ITI, ఇంజినీరింగ్‌లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసి 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News April 12, 2025

మీకు ఏ యాప్ పని చేయట్లేదు?

image

యూపీఐ పేమెంట్స్‌లో మరోసారి అంతరాయం ఏర్పడింది. కొందరు UPI యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయగా తమ అకౌంట్‌లో అమౌంట్ డెబిట్ అయ్యిందని, కానీ అవతలి వాళ్లకు క్రెడిట్ కాలేదని అంటున్నారు. మరి మీరు ఏ UPI యాప్ వాడి ఇలాంటి ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారు. కామెంట్ చేయండి.
* PhonePe
* Google Pay
* Paytm
* BHIM UPI
* Others

News April 12, 2025

IPL: టాస్ గెలిచిన LSG

image

IPLలో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కుమార్తె అనారోగ్యం కారణంగా మిచెల్ మార్ష్ ఈ మ్యాచుకు అందుబాటులో లేరు. LSG: మార్క్‌రమ్, పూరన్, పంత్(C), హిమ్మత్ సింగ్, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్. GT: సుదర్శన్, గిల్(C), బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, టివాటియా, అర్షద్, రషీద్, సాయికిశోర్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్.

News April 12, 2025

గ్రూప్-1 ఫలితాలపై ఆరోపణలు.. BRS నేతకు TGPSC నోటీసులు

image

TG: గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని <<15989891>>ఆరోపించిన<<>> బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఎటువంటి ఆరోపణలు చేయవద్దని సూచించింది.