India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ‘ఈసారి e-వ్యర్థాల సేకరణ-సురక్షితంగా రీసైకిల్ చేయడమనే థీమ్ను ఎంచుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టితోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి’ అని ట్వీట్ చేశారు.
రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.
శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.
ఈపీఎఫ్వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. మ్యాచ్ కూడా కొంత ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. లేట్గా స్టార్ట్ అయినా మధ్యలో వర్షం రాకపోతే పూర్తి 40 ఓవర్ల ఆట యథావిధిగా జరుగుతుంది.
AP: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-1లో రెల్లి సహా 12 ఉపకులాలకు 1%, గ్రూప్-2లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లో మాల సహా 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగాల్లో 200 రోస్టర్ పాయింట్లు అమలు చేయనుంది. 3 కేటగిరీల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్హులు లేకుండా తదుపరి నోటిఫికేషన్కు ఖాళీలను బదలాయిస్తారు.
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB-PBKS మ్యాచ్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పేశారు. వాన త్వరగా తగ్గి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షంతో ఇవాళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.
SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ఎయిర్పోర్టులో భర్తతో కలిసి ఫొటో దిగిన ఆమె ‘గుడ్బై ఇండియా’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కమిన్స్ మిగతా మ్యాచులు ఆడకుండా IPL మధ్యలోనే ఆసీస్ వెళ్లిపోతున్నాడా? అని SRH ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే అతడు భార్యకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాత్రమే ఎయిర్పోర్టు వెళ్లాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు VHP ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సంస్థ సభ్యులు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.
AP: వైసీపీలో తాను నంబర్ 2గా ఉన్నానని, జగన్కు వెన్నుపోటు పొడిచానని మీడియాలో రాస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానమనేది ఓ మిథ్య. నాయకుడికి నాపై ఓ కోటరీ చాలా అపోహలు కల్పించింది. ఆయన మనసులో నాకు స్థానం లేదని గ్రహించి అవమాన భారం తాళలేక పార్టీని వీడాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నా స్థానం 2వేలకు పడిపోయింది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.