India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు నానాటికీ తగ్గిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో కనీస స్థాయుల్ని దాటి కిందికి పడిపోతున్నాయి. శ్రీశైలం(సామర్థ్యం 215 టీఎంసీలు)లో 39 టీఎంసీలే ఉంది. నాగార్జునసాగర్లో(సామర్థ్యం 312 టీఎంసీలు) 141 టీఎంసీల నీరు మిగిలింది. సాగర్లో మరో ఐదు అడుగుల మేర నీరు దిగువకు వెళ్తే హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
TG: <<16017360>>రాజీవ్ యువ వికాసం పథకానికి<<>> దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. అయితే 2, 3 రోజులుగా వెబ్సైట్ సర్వర్ డౌన్ అవుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు నమోదు చేస్తుండగానే వెబ్పేజీ నిలిచిపోతోంది. దీంతో మళ్లీ మొదటినుంచి ప్రారంభించాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
వెబ్సైట్: <
కొన్నాళ్లుగా ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే Way2Newsలో చూడాలి అనేలా పరిస్థితి మారిపోయింది. దీనికి మన సూపర్ఫాస్ట్ టెక్నాలజీ ఒక కారణం. వెబ్సైట్లలో క్లిక్ చేసినప్పుడు ప్రమాదకర లింక్స్ ఓపెన్ అవడం వల్ల గతంలో పడిన ఇబ్బందులు ఇక్కడ లేకపోవడం మరో కారణం. సింపుల్గా చెప్పాలంటే మన యాప్లో రిజల్ట్స్ సూపర్ ఫాస్ట్, సింపుల్, సేఫెస్ట్.
-నేటి AP ఇంటర్ రిజల్ట్స్ కూడా ముందుగా, సేఫ్గా మన వే2న్యూస్లో..
జమ్మూకశ్మీర్లోని చత్రు ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ వీరమరణం పొందినట్లు వెల్లడించారు.
నేడు చైత్ర శుద్ధ పౌర్ణమి. హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు. ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవం లేదా జయంతిగా జరుపుకొంటారు. ఇక పరాశర సంహిత ప్రకారం.. వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున స్వామివారు జన్మించారు. ఆ తిథిని జన్మోత్సవం/జయంతిగా జరుపుతారు. రెండు సందర్భాల్నీ చాలామంది జయంతిగానే జరపడం వల్ల ఏటా 2సార్లు హనుమజ్జయంతి వస్తుంటుంది.
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, కాజల్, నవదీప్ నటించిన ఆర్య-2 మూవీ రీరిలీజ్లో అదరగొట్టింది. ఓవరాల్గా దాదాపు రూ.8కోట్లు కలెక్షన్లు సాధించింది. అలాగే HYD ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రూ.64 లక్షలు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన చిత్రాల్లో ఇదే ALL TIME RECORD అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ కల్ట్ క్లాసిక్గా నిలిచింది.
AP: పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం బాధాకరమని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్లు పంపాడు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం.
యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్నకు SBI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21-32 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 13నెలలపాటు గ్రామాల్లోని సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా ₹16K స్టైఫండ్, రవాణా, ఇతర ఖర్చులకు ₹3K ఇస్తారు. ప్రోగ్రామ్ను పూర్తిచేసిన వారికి ₹90K ఇస్తారు.
వెబ్సైట్: <
TG: వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కోటి మొక్కలు నాటి వనజీవినే, తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి లోటని భట్టి అన్నారు.
Sorry, no posts matched your criteria.