India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

TG: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో BJP పెద్దగా ప్రభావం చూపించలేదు. MP డీకే అరుణకు మున్సిపల్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ గద్వాలలో పోటీ ఇవ్వలేకపోయారు. అక్కడ 32 వార్డుల్లో కేవలం 6 చోట్ల మాత్రమే BJP గెలిచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా మహబూబ్నగర్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో కాషాయ జెండా ఎగరలేదు. ఈ ఫలితాలు డీకే అరుణకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

AP: తిరుమల శ్రీవారి విషయంలో తెలిసి కానీ, తెలియకుండా కానీ ఏ తప్పు చేయనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి రాష్ట్రంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఆయనను తలుచుకుంటే హాయిగా నిద్ర వస్తుందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ సున్నితమైన అంశమని, దానిపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నానని చెప్పారు. అయితే కొంత మంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు.

TG: ‘ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ <<19103865>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న యాదగిరిగుట్ట 9వ వార్డు BJP అభ్యర్థి ఉమ్మగండి రాజమణి ఓడిపోయారు. ‘దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఓటెయ్యండి’ అంటూ ఆమె బోరున విలపించిన తీరు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. నేటి ఫలితాల్లో 10 ఓట్లు మాత్రమే వచ్చినా రాజమణి నిరాశ చెందలేదు. డబ్బు, మద్యం తీసుకోకుండా బీజేపీకి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్యానికి మేలు చేసే <<19126815>>స్వదేశీ<<>> ఆపిల్ పండ్లను ఇలా గుర్తించవచ్చు. స్వదేశీ ఆపిల్స్ సహజమైన రంగులో తక్కువ మెరుపుతో ఉంటాయి. వీటిపై విదేశీ రకాల వలె కృత్రిమ మైనం పూత ఉండదు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన రాయల్ డెలీషియస్, పసుపు రంగు గోల్డెన్ డెలీషియస్, కశ్మీర్ స్పెషల్ అంబ్రి రకాలు మన దేశంలో ప్రసిద్ధి. తాజాదనం, రుచి కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. share it

2029లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ PM అవుతారని ఆ పార్టీ MP మాణికం ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారంలోకి రాగానే పాలనలో పాతుకుపోయిన ‘సీక్రెసీ కల్చర్’ను రూపుమాపేలా గైడ్లైన్స్ తీసుకొస్తారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, ఆర్మీ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమే అయినప్పటికీ.. పాలనలో పారదర్శకత కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కని వ్యాఖ్యానించారు.

<

శివుని జటాజూటంలోని నెలవంక మనస్సుపై నియంత్రణను సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఎప్పుడూ మారుతూ ఉంటాడు. అలాంటి చంద్రుడిని ధరించడమంటే చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థితప్రజ్ఞత సాధించడమే. ఇది అమృతత్వానికి చిహ్నం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనస్సును శాంతంగా, ధీరత్వంతో ఉంచుకోవాలని గుర్తుచేస్తుంది. కాలక్రమంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూనే, అంతర్గత శాంతిని కోల్పోకూడదని సందేశం!

పత్తి తీత తర్వాత ఆ చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తి మోళ్లను అందుబాటులో ఉండే ట్రాక్టరు రోటవేటరుతో భూమిలో కలియదున్నాలి. ఎండిన మొక్కల మోళ్లు, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నడం వల్ల పంటకు హాని చేసే పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పత్తి పంట పూర్తయిన తర్వాత ఆ భూమిలో నీటి వసతి ఉంటే రెండో పంటగా ఇతర ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.