news

News February 13, 2026

అదృష్టం వరించింది.. టాస్‌తో గెలిచారు

image

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.

News February 13, 2026

పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

image

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

News February 13, 2026

గద్వాల జేజమ్మకు షాక్: బలం చూపని బీజేపీ

image

TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJP పెద్దగా ప్రభావం చూపించలేదు. MP డీకే అరుణకు మున్సిపల్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ గద్వాలలో పోటీ ఇవ్వలేకపోయారు. అక్కడ 32 వార్డుల్లో కేవలం 6 చోట్ల మాత్రమే BJP గెలిచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా మహబూబ్‌నగర్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో కాషాయ జెండా ఎగరలేదు. ఈ ఫలితాలు డీకే అరుణకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

News February 13, 2026

శ్రీవారి విషయంలో తప్పు చేయను: చంద్రబాబు

image

AP: తిరుమల శ్రీవారి విషయంలో తెలిసి కానీ, తెలియకుండా కానీ ఏ తప్పు చేయనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి రాష్ట్రంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఆయనను తలుచుకుంటే హాయిగా నిద్ర వస్తుందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ సున్నితమైన అంశమని, దానిపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నానని చెప్పారు. అయితే కొంత మంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు.

News February 13, 2026

ఓట్ల కోసం బోరున ఏడ్చిన BJP అభ్యర్థి.. రిజల్ట్ ఇదే

image

TG: ‘ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ <<19103865>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న యాదగిరిగుట్ట 9వ వార్డు BJP అభ్యర్థి ఉమ్మగండి రాజమణి ఓడిపోయారు. ‘దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఓటెయ్యండి’ అంటూ ఆమె బోరున విలపించిన తీరు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. నేటి ఫలితాల్లో 10 ఓట్లు మాత్రమే వచ్చినా రాజమణి నిరాశ చెందలేదు. డబ్బు, మద్యం తీసుకోకుండా బీజేపీకి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

News February 13, 2026

స్వదేశీ ఆపిల్స్‌ను గుర్తించండిలా!

image

ఆరోగ్యానికి మేలు చేసే <<19126815>>స్వదేశీ<<>> ఆపిల్ పండ్లను ఇలా గుర్తించవచ్చు. స్వదేశీ ఆపిల్స్ సహజమైన రంగులో తక్కువ మెరుపుతో ఉంటాయి. వీటిపై విదేశీ రకాల వలె కృత్రిమ మైనం పూత ఉండదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాయల్ డెలీషియస్, పసుపు రంగు గోల్డెన్ డెలీషియస్, కశ్మీర్ స్పెషల్ అంబ్రి రకాలు మన దేశంలో ప్రసిద్ధి. తాజాదనం, రుచి కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. share it

News February 13, 2026

2029లో రాహుల్ PM.. తొలుత చేసే పని ఇదే: మాణికం ఠాగూర్

image

2029లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ PM అవుతారని ఆ పార్టీ MP మాణికం ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారంలోకి రాగానే పాలనలో పాతుకుపోయిన ‘సీక్రెసీ కల్చర్‌’ను రూపుమాపేలా గైడ్‌లైన్స్ తీసుకొస్తారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, ఆర్మీ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమే అయినప్పటికీ.. పాలనలో పారదర్శకత కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కని వ్యాఖ్యానించారు.

News February 13, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>ఎగ్జిమ్ <<>>బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 13, 2026

జటాజూటంలో నెలవంక ఎందుకయ్యా శివయ్యా?

image

శివుని జటాజూటంలోని నెలవంక మనస్సుపై నియంత్రణను సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఎప్పుడూ మారుతూ ఉంటాడు. అలాంటి చంద్రుడిని ధరించడమంటే చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థితప్రజ్ఞత సాధించడమే. ఇది అమృతత్వానికి చిహ్నం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనస్సును శాంతంగా, ధీరత్వంతో ఉంచుకోవాలని గుర్తుచేస్తుంది. కాలక్రమంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూనే, అంతర్గత శాంతిని కోల్పోకూడదని సందేశం!

News February 13, 2026

పత్తి తీత తర్వాత తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు

image

పత్తి తీత తర్వాత ఆ చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తి మోళ్లను అందుబాటులో ఉండే ట్రాక్టరు రోటవేటరుతో భూమిలో కలియదున్నాలి. ఎండిన మొక్కల మోళ్లు, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నడం వల్ల పంటకు హాని చేసే పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పత్తి పంట పూర్తయిన తర్వాత ఆ భూమిలో నీటి వసతి ఉంటే రెండో పంటగా ఇతర ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు.