India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాక్ ఆటగాడు అర్షద్ను NC క్లాసిక్ ఈవెంట్కు ఆహ్వానించడంపై భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘అర్షద్కు ఆ ఆహ్వానం ఉగ్రదాడులకు ముందు పంపించా. ఆ ఘటన తర్వాత అతడిని పిలిచే ప్రసక్తే లేదు. నాకు నా దేశమే ముఖ్యం. నన్ను, నా కుటుంబాన్ని అకారణంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాది క్రితం నా తల్లిని కొనియాడిన అదే నోళ్లు నేడు ఆమెను దారుణంగా తిడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
బందిపొరా ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపును తీవ్రం చేశాయి. ఈ క్రమంలో బందిపొరాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాది మృతిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు నష్టపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు తప్ప మిగతావన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి.
పాక్తో సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ నీటిని కేంద్రం ఎక్కడ ఉంచుతుందో తెలపాలని కోరారు. ‘బైసరన్ మైదానంలో CRPFజవాన్లను ఎందుకు మోహరించలేదు, ఘటన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, ఇవి తీవ్ర మతతత్వ హత్యలని పునరుద్ఘాటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంతోనే ఈ దాడి జరిగిందని ఎంపీ గతంలోనే అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవుపై వెళ్లిన సైనికులను వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ ద్వివేది, సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. LoC వద్ద పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో మైలురాయి చేరనుంది. ఇవాళ SRHతో జరిగే మ్యాచుతో టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత ప్లేయర్గా నిలవనున్నారు. ఆయన కంటే ముందు రోహిత్ శర్మ(456), దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(407) ఉన్నారు. ఇప్పటివరకు 399 మ్యాచుల్లో 38 సగటుతో 7,566 పరుగులు చేశారు. ఇందులో 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ‘టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం దారుణం. ఆయన వ్యాఖ్యలు నిజంగానే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ఎక్స్లో మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైనా డానిష్ దాయాది దేశాన్ని విమర్శించారు. అతడు ప్రస్తుతం USలో నివాసముంటున్నారు.
అంటూ ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. TG జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట బాబు పుట్టడంతో ప్రసన్న ఉద్యోగం మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. ఈక్రమంలోనే ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
సినీ హీరోలపై అభిమానాన్ని వారి ఫ్యాన్స్ వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కర్నూలుకు చెందిన ఓ మహేశ్ బాబు ఫ్యాన్ తన పెళ్లి శుభలేఖపై సూపర్ స్టార్ ఫొటోను ముద్రించి తన ఇష్టాన్ని చాటుకున్నారు. శుభలేఖ కవర్పై దేవుడి ఫొటోల కింద మహేశ్ ఫొటోను ముద్రించారు. అతడు దీన్ని నెట్టింట పంచుకోగా మహేశ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
TG: నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామ దండు కదిలితే, నేడు రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్భావ సభకు కదం తొక్కుతూ యువత పాదయాత్ర చేపట్టారన్నారు. పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండాను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. BRS రజతోత్సవం.. తెలంగాణ ప్రజల విజయోత్సవమని రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.