India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాది హృదయాలను కన్నీళ్లు పెట్టించాయి. అయితే ఈ ఘటనపై MPకి చెందిన ఒసాఫ్ ఖాన్ అభ్యంతకర కామెంట్స్ చేశాడు. ‘వినయ్ని చంపించడానికి ఆయన భార్య ఓ షూటర్ని నియమించి అవకాశం రావడంతో అతనిని అంతం చేసి ఉండవచ్చు. ముందు ఆమెను విచారించాలి’ అని SMలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇవాళ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. యుద్ధ భయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ తొలుత గ్రీన్లోనే మొదలైనా క్రమంగా రెడ్లోకి పడిపోయాయి. ప్రస్తుతం బీఎస్ఈ 60 పాయింట్లు నష్టపోయి 79,742 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 24,213 వద్ద కొనసాగుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణం ఆలస్యం కావడంతో 39 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గుర్రాలు అందుబాటులో లేక 28 మంది, ఓ రెస్టారెంట్లో ఫుడ్లో ఉప్పు ఎక్కువైందని కేరళ ఫ్యామిలీ ఆగిపోయింది. అదే సమయంలో ఉగ్ర దాడులు చోటు చేసుకోగా అనుకోని ఆలస్యం వీరిని మృత్యువు నుంచి తప్పించింది. మరోవైపు దాడి జరిగిన టైమ్లో భేల్పూరి తినేందుకు స్నాక్ బ్రేక్ తీసుకున్న ఓ జంట ప్రాణాలతో బయటపడింది.
కెప్టెన్ సంజూ శాంసన్ లేని లోటు తమ జట్టుకు తెలుస్తోందని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అన్నారు. ‘సంజూ చాలా అనుభవజ్ఞుడైన బ్యాటర్, కెప్టెన్. మా లైనప్లో తను లేని లోటు కనిపిస్తోంది. అతడి గాయం మాకు చాలా నష్టం చేసింది’ అని పేర్కొన్నారు. తొలి 3 మ్యాచులు బ్యాటర్గా ఆడిన సంజూ, ఆ తర్వాత పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచుల్లో గెలవాల్సిన స్థితి నుంచి RR ఓటమిపాలైంది.
TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన గౌతమ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు కాంగ్రెస్ సహకరించిందని ఆరోపించారు. కార్పోరేటర్లు ఓట్లు వేయకుండా అడ్డుకున్న BRSను ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, MIM చెప్పినట్లుగా కాంగ్రెస్ చేస్తోందన్నారు.
విశ్లేషకుల ప్రకారం.. హింసతో సమాజంలో భయం కల్గించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికస్థితి తదితరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం (టెర్రరిజం). దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. సామాజిక, రాజకీయ లక్ష్యాలతో హింసకు పాల్పడేవారు తీవ్రవాదులు (మిలిటెంట్స్). రెండూ హింస మార్గాలే, కానీ ఉద్దేశాలు వేరు. పహల్గాం దాడి ‘మిలిటెంట్ అటాక్’ అన్న <<16207620>>NYTపై<<>> USA ప్రభుత్వం ‘ఇది టెర్రరిస్ట్ అటాక్’ అని కౌంటరిచ్చింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, BRS దూరంగా ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో నిలిచాయి. మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు పోలయ్యాయి.
AP: నంద్యాల జిల్లా దొర్నిపాడులో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. జెడ్పీ హైస్కూల్లో చదివి 557 మార్కులు సాధించిన సారా అనే బాలిక ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీనే మరణించింది. చనిపోయే ముందు కూడా తనకు 500పైనే మార్కులొస్తాయని చెప్పిందంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
తమిళనాడులోని అరక్కోణంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై దుండగులు బోల్టులు తప్పించారు. అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషించేవారిని ఒకటే అడుగుతున్నా. గడచిన 78 ఏళ్లుగా మీ పోరాటం ఏం సాధించింది? ఒక్క మిల్లీమీటర్ భూమైనా దక్కిందా? ఇంకో 78వేల ఏళ్లైనా మీరు సాధించేదేమీ లేదు. ఏమీ మారదు. మరి ఎందుకీ హింస? చక్కగా శాంతియుతంగా జీవిద్దాం’ అని సూచించారు.
Sorry, no posts matched your criteria.