news

News September 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.

News September 8, 2025

మూసీని ప్రక్షాళన చేయొద్దా: రేవంత్

image

TG: గంగా, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు కానీ తాము మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని సీఎం <<17649892>>రేవంత్<<>> రెడ్డి ప్రశ్నించారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. ఇందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నా. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది’ అని స్పష్టం చేశారు.

News September 8, 2025

ఈ సూపర్ కాప్ గురించి తెలుసా?

image

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్‌ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

News September 8, 2025

TTD ఈవోగా మరోసారి సింఘాల్.. ఆయన గురించి తెలుసా?

image

AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్‌ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.

News September 8, 2025

నేడే లాస్ట్.. రూ.1.26 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 841 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 410 AAO (స్పెషలిస్ట్), 350 AAO (జనరలిస్ట్), 81 ఏఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హత కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.88,635 నుంచి రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. <>www.licindia.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 8, 2025

BRSకు రాజకీయంగా కనెక్టివిటీ పోయింది: ఎంపీ చామల

image

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.

News September 8, 2025

రాష్ట్రంలో యూరియా సమస్య ఉండొద్దు: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి యూరియా పంపిణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సమస్య లేకుండా చూడాలని, దీనిపై రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ‘క్వింటా ఉల్లి ధర రూ.1,200కు తగ్గకూడదు. రూ.1,200కు తగ్గితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అరకు కాఫీ తోటల్లోని బెర్రీ బోరర్ తెగులు ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.

News September 8, 2025

CPGET ఫలితాలు విడుదల

image

TG: రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల్లో MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన CPGET (Common Post Graduate Entrance Tests-2025) ఫలితాలు విడుదలయ్యాయి. <>https://cpget.tgche.ac.in/<<>>లోకి వెళ్లి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు 45,477 మంది హాజరయ్యారు.

News September 8, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఏ పార్టీ మద్దతు ఎవరికి?

image

రాధాకృష్ణన్(ఎన్డీఏ అభ్యర్థి): బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన-షిండే, YCP, LJP, అన్నాడీఎంకే(పళనిస్వామి), JDS, జనసేన, RLD, అప్నాదళ్, NCP(అజిత్ పవార్), SKM, స్వతంత్రులు.
సుదర్శన్ రెడ్డి (ఇండీ కూటమి): కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, TMC, ఆప్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), NCP(శరద్ పవార్), RJD(లాలూ), CPM, CPI, ఎంఐఎం.
* బీఆర్ఎస్(4), బీజేడీ(7) దూరం.

News September 8, 2025

ఆసియాకప్ విజేతలు వీరే..

image

1984 నుంచి 2023 వరకు 14 సార్లు వన్డే, రెండు సార్లు టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియాకప్‌లో అత్యధిక సార్లు టీమ్ ఇండియా(8) విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజయం సాధించాయి. ఈ సారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లోనే ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్‌లో జరగగా రోహిత్ సారథ్యంలో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.