India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. సమ్మర్ సీజన్కు తోడు ఐపీఎల్ ఉండటంతో రోజుకు 3లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. IPL ప్రారంభమైన మార్చి 22వరోజు ఏకంగా 4లక్షల కాటన్ల బీర్లు సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పెరిగిన డిమాండ్ తీర్చడానికి బీర్ సరఫరా సంస్థలు సైతం ఉత్పత్తిని పెంచాయి. లిక్కర్ అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది.
ఈరోజు CSKvsSRH మ్యాచ్లో ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. చెన్నై కంటే రైజర్స్కే ఓటమికి అవకాశాలెక్కువ ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చెపాక్లో SRH చెత్త రికార్డే దీనిక్కారణం. ఆ స్టేడియంలో సన్రైజర్స్ 12 మ్యాచులాడితే రెండింటిలోనే గెలిచింది. మొత్తంగా IPLలో చెన్నైపై 22 మ్యాచులు ఆడిన హైదరాబాద్ 6సార్లు మాత్రమే విన్ అయింది.
ఈనెల 21న కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఇవాళ వాటికన్ సిటీ వెళ్లనున్న ఆమె రేపు అంత్యక్రియల్లో పాల్గొంటారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపం తెలుపుతారని వెల్లడించింది.
సిక్కింను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదార్లు మూసుకుపోయి 1000మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. కొండచరియల కారణంగా మున్షితాంగ్, లాచుంగ్ చుంగ్తాంగ్ రోడ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.
రాజస్థాన్ రాయల్స్కు ప్లేఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. 9 మ్యాచ్లలో 7 ఓటములతో ఆ జట్టుకు రన్ రేటు -0.625 ఉంది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే మిగతా 5 మ్యాచ్లను అతి భారీ తేడాలతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్లు మినహా మరే జట్టు 14 పాయింట్లను దాటకూడదు. అలాగే ఇతర జట్ల కంటే బెటర్ నెట్రన్ రేటు ఉండాలి. GT, DC, RCB, MI, PBKS అదరగొడుతున్నందున ఏదైనా అద్భుతం జరిగితే తప్ప RR ప్లేఆఫ్స్ వెళ్లలేదు.
TG: టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ ఆమోదం లభించగానే ఫలితాలను రిలీజ్ చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.
TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ADLB, నిర్మల్, MNCLలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా NZMBలోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Sorry, no posts matched your criteria.