India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కొత్తగా ఇళ్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్ బిగించుకోని వారికి ప్రభుత్వం రూ.825కే మీటర్లు ఏర్పాటు చేయనుంది. Sep 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రశీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి.
TG: భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు.
బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణాలు. 25,089 వద్ద మొదలైన NSE నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 25,095 వద్ద చలిస్తోంది. BSE సెన్సెక్స్ 511 పాయింట్లు పతనమై 82,026 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 5:45గా ఉంది. ఏషియన్ పెయింట్స్, BPCL, HUL, హీరోమోటో, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
AP: బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెజవాడ నీటమునిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్యతరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. క్రమక్రమంగా అవి పెద్దపెద్ద కాలనీలుగా విస్తరించాయి. దీంతో ఇక్కడా హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 67వేల మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 జీవాలు మృతి చెందాయి.
తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.
AP: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో స్కూళ్లకు హాలీడే ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు TGలోని ఖమ్మం జిల్లాలోనూ ఇవాళ హాలిడే ఇచ్చారు. మరిన్ని జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
TG: వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ <<14008928>>ఉద్యోగ<<>> సంఘాల జేఏసీలు ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ఇవ్వడంపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన 5 డీఏలు, 4 సరెండర్ లీవుల బిల్లులు, పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని నిలదీస్తున్నారు.
TG: వరద ప్రభావిత ప్రాంతాల్లో BJP నేతలు నేటి నుంచి పర్యటించనున్నారు. MPలు, MLAలు, ముఖ్య నేతలు వరద బాధితులను పరామర్శించాలని పార్టీ నిర్ణయించింది. అధిక నష్టం వాటిల్లిన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తొలి విడత పర్యటించి బాధితులకు భరోసా కల్పించనున్నారు. రెండో విడతలో కోదాడ, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అటు సభ్యత్వ నమోదును ఈ నెల 7 నుంచి కొనసాగించనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
Sorry, no posts matched your criteria.