India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయాలని పీఎంవో ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.
విజయవాడను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చాలా మంది వరద నేపథ్యంలో ఇంటిపైనే తలదాచుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. NDRF, ప్రభుత్వాలు సాయం చేస్తున్నా కొన్ని ప్రాంతాలకు పడవలు వెళ్లలేకపోతున్నాయి. దీంతో తమ కుటుంబాలను బయటకు తీసుకొచ్చేందుకు ట్యూబులను ప్రజలు కొనుక్కెళ్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తున్నప్పటికీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.
భారతదేశంలో బ్రిటిష్ వారు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గల ముఖ్య కారణాలలో ఒకదాని గురించి ఓ రైల్వే అధికారి చెప్పుకొచ్చారు. ‘1845లో మొదటి ఆంగ్లో- సిక్కు యుద్ధం జరిగినప్పుడు దేశంలో రైళ్లు అందుబాటులో లేవు. ఆ సమయంలో దళాలను కోల్కతా నుంచి బెనారస్కు తరలించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 16 రోజులు పట్టింది. దీంతో వేగవంతమైన సరఫరా కోసం రైలు ముఖ్యమని భావించి తీసుకొచ్చారు’ అని Xలో తెలిపారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో ఉన్న కాంగ్రెస్ మిత్రుల వెతుకులాటలో పడింది! ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆప్తో పొత్తు అంశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ నేతల్ని కోరినట్టు తెలుస్తోంది. అప్కు 3-4 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆప్ MP సంజయ్ పొత్తు ప్రతిపాదన వార్తలను ఆహ్వానించారు. CM కేజ్రీవాల్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్లను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. వరదల వల్ల సంభవించిన విధ్వంసం నుంచి ప్రజలు కోలుకోవడంలో వీరు చేసిన సహకారం దోహదపడుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం వీరి సాయానికి కృతజ్ఞతలు తెలిపినట్లు సీపీఆర్వో ట్విటర్లో పేర్కొన్నారు.
UPలో ఆస్తులు ప్రకటించని 2.44 లక్షల మంది ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలు నిలిపేసింది. ఆగస్టు 31లోపు ఉద్యోగులు స్థిర, చర ఆస్తుల వివరాలు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 లక్షల మంది తమ ఆస్తులను ప్రకటించారు. మిగిలినవారు స్పందించకపోవడంతో జీతాలు నిలిపేసింది. అయితే, పండుగల నేపథ్యంలో జీతాల విడుదలకు ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఆస్తుల ప్రకటన గడువు Sep 30వరకు పొడిగించింది.
AP: వైజాగ్లోని కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ కడుపులోంచి లిథోపిడియన్ అనే గడ్డ, ఎముకల వంటి పదార్థాన్ని తొలగించారు. వైద్య పరిభాషలో దీనిని స్టోన్ బేబీ అని పిలుస్తారని ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద్ తెలిపారు. ఇది చాలా అరుదైన కేసు అని, ఆపరేషన్ విజయవంతమవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీగా వర్షాలు నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపట్లేదు. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దీంతో రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.75.26 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. వీకెండ్ పూర్తయ్యేలోపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
గత రెండు సెషన్లలో లాభాలు సహా మంగళవారం హై ట్రేడ్ వాల్యూమ్ కారణంగా ఝున్ఝున్వాలా పోర్ట్ఫోలియో స్టాక్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.155.73కి చేరుకున్నాయి. మొత్తంగా 20 శాతం గెయిన్ అయ్యాయి. ఆర్థిక సేవల రంగంలో ఉన్న జియోజిత్ ఫైనాన్షియల్లో జూన్ 2024 త్రైమాసికం ముగింపు నాటికి రేఖా ఝున్ఝున్వాలాకు 7.2 శాతం వాటాతో 17.21 మిలియన్ షేర్లు ఉన్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జనగామ, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.