India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడలో ప్రతి ఏరియాకు ఆహారం, నీళ్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అర్ధగంట ఆలస్యమైందని ఆవేశపడితే అది నాలుగైదు గంటలు అయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల వ్యవస్థలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం 3 బాధిత కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో ముందుకు రావాలని కోరారు.
2023-24లో ఐఐటీ బాంబేలో 1,475 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీరు సగటున రూ.23.50 లక్షల వార్షిక వేతన పొందుతున్నట్లు తెలిపింది. రూ.కోటి, ఆపైన వార్షిక వేతనంతో 22 మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొంది. బీటెక్లో 83.39 శాతం, ఎమ్టెక్లో 83.5, ఎమ్ఎస్ రీసెర్చ్లో 93.33 శాతం ప్లేస్మెంట్లు జరిగినట్లు ప్రకటించింది.
TG: ఖమ్మం నగరంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘పువ్వాడ అజయ్ ఆక్రమించిన స్థలంలో ఆస్పత్రి కట్టారు. ఆక్రమణలు తొలగించాలని పువ్వాడకు హరీశ్ రావు చెప్పాలి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తాం. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తాం. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడింది’ అని మీడియాతో చిట్చాట్లో అన్నారు.
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలను ముఖ్యమంత్రుల సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపారు. విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ 3 పూటలా ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. NDRF బృందాలు చేరుకోలేని చోట హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించుకోవాలని సూచించారు. రెండు రోజులు ఆహారం, నీరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని పనిచేయాలని కోరారు. ఇవాళ 5 హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు.
AP: విజయవాడలో విలయానికి కారణమైన బుడమేరుకు ఏడు చోట్ల గండి పడిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాటిని పూడ్చేందుకు జలవనరుల శాఖ కృషి చేస్తోందని, 2, 3 రోజులు సమయం పడుతుందని చెప్పారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా కరకట్ట పటిష్ఠతకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీకి 12లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
సాధారణ ప్రజలు, భద్రతా దళాలపై డ్రోన్ బాంబు దాడులు ఉగ్రవాద చర్యేనని మణిపుర్ సీఎం బిరేన్ సింగ్ అన్నారు. తమ నుంచి ప్రతిఘటన బలంగానే ఉంటుందని హెచ్చరించారు. ‘ఈ హింసను మేం ఖండిస్తున్నాం. విద్వేషం, విభజన వాదానికి వ్యతిరేకంగా మణిపుర్ ప్రజలు ఏకమవుతారు’ అని ఆయన పేర్కొన్నారు. వెస్ట్ ఇంఫాల్లోని కౌట్రక్, సెంజామ్ చిరాంగ్లో సాయుధ దుండగుల వేర్వేరు డ్రోన్ బాంబు దాడుల్లో ఇద్దరు మరణించారు. 12 మంది గాయపడ్డారు.
కాంగో దేశంలోని మకాల జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన 129 మంది ఖైదీలు తొక్కిసలాటలో చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. అడ్మినిస్ట్రేషన్ భవనం దెబ్బతినిందని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించింది. అయితే తమకు బయట నుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయని కొందరు ఖైదీలు చెబుతున్నారు.
జులై 23 నుంచి ఆగస్టు 21 వరకు రూ.60వేల కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్న FII, FPIలు మళ్లీ భారత్ బాట పట్టారు. వారం రోజులుగా స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు చేపట్టారు. వడ్డీరేట్ల కోతకు సమయం వచ్చేసిందన్న US ఫెడ్ సంకేతాలే ఇందుకు కారణమని తెలిసింది. విధాన రేట్లు తగ్గితే US బాండ్ యీల్డులు క్షీణిస్తాయి. పైగా అక్కడ రెసెషన్ భయాలు ఉన్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలో మెరుగైన రాబడి పొందొచ్చని FII, FPIల భావన.
నాలుగైదు రోజులుగా సూర్యరశ్మి తగలక వణికిపోతున్న శరీరానికి ఊరటనిచ్చేందుకు కారు మబ్బులను చీల్చుకుంటూ భానుడు బయటకొచ్చాడు. హైదరాబాద్లో ఉదయం నుంచి వర్షం కురిసినప్పటికీ ఒక్కసారిగా వాతావరణం పొడిగా మారిపోయింది. ప్రస్తుతం సూర్యుడు వచ్చేసరికి నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీవద్ద సూర్యుడు వచ్చాడో? లేదో? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.