news

News September 11, 2024

తక్కువ ధరకే మద్యం అందించేలా పాలసీ: కొల్లు రవీంద్ర

image

AP: నాసిరకం మద్యంతో గత YCP ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సొంత ఆదాయం పెంచుకునేలా లిక్కర్ పాలసీ తెచ్చి ప్రభుత్వ ఆదాయానికి జగన్ గండి కొట్టారని దుయ్యబట్టారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ తీసుకొస్తామని తెలిపారు. OCT 1 నుంచే కొత్త విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జగన్ చేసిన తప్పులపై ప్రజలే తమకు రెడ్ బుక్ ఇచ్చారన్నారు.

News September 11, 2024

WT20 WC: 18 ఏళ్లలోపు వారికి ఫ్రీ ఎంట్రీ

image

అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ T20 WC మ్యాచ్‌లు చూసేందుకు 18 ఏళ్లలోపు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ICC ప్రకటించింది. మహిళా క్రికెట్‌ చూసేందుకు మరింత మంది అభిమానులు తరలిరావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్ల పైనున్న వాళ్లకు ఒక్కో టికెట్ ధర రూ.114 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. UAE వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

News September 11, 2024

HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: హరీశ్

image

TG: హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఫలితంగా మహానగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ హైదరాబాద్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలోనూ సీఎం మాట మార్చారని మండిపడ్డారు.

News September 11, 2024

బ్లాక్‌బస్టర్ మూవీ ’96’కి సీక్వెల్

image

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో 2018లో వచ్చిన ’96’ మూవీ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంది. స్కూల్ డేస్‌లో ప్రేమించుకుని విడిపోయిన హీరో, హీరోయిన్ 20ఏళ్ల తర్వాత గెట్ టు గెదర్‌లో కలుసుకోవడం, వారి మధ్య లవ్ ట్రాక్‌ను డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. కాగా ఈ మూవీ సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు దర్శకుడు తెలిపారు. విజయ్, త్రిష డేట్స్ ఆధారంగా సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు.

News September 11, 2024

అమిత్‌షా చేతికి వరద నష్టంపై నివేదిక

image

ఏపీ, తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా చేతికి అందింది. రెండు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ రిపోర్టును షాకు అందించారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందాలు త్వరలోనే పూర్తిస్థాయి నివేదికలు ఇస్తాయని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు.

News September 11, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News September 11, 2024

కోచింగ్ సెంటర్లపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

image

TG: నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం అయింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై భేటీలో చర్చించారు. రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్రమార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

News September 11, 2024

లోకేశ్‌కు చెక్‌ అందించిన హీరో సాయి ధరమ్ తేజ్

image

ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏపీ మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్‌ను అందించారు. ‘ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన చెక్‌ను లోకేశ్ అన్నకు అందించా’ అని ట్వీట్ చేశారు. కాగా, తేజ్‌ను అభినందిస్తూ లోకేశ్ రిప్లై ఇచ్చారు.

News September 11, 2024

సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొంది. HYDలో జరిగే కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి, జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తారు. కాగా 17న కేంద్రం ‘విమోచన దినోత్సవం’గా ప్రకటించి వేడుకలు నిర్వహిస్తోంది.

News September 11, 2024

సిక్కులపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రో ఖలిస్థానీ నేత సపోర్ట్

image

భారత్‌లో సిక్కుల ఉనికికి ముప్పుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రో ఖలిస్థానీ నేత గురుపత్వంత్ పన్నూన్ సమర్థించారు. SFJ ఖలిస్థానీ రెఫరెండం ప్రచారం న్యాయమేనని ఆయన ఉద్ఘాటించినట్టు అయిందన్నారు. ‘ప్రో ఖలిస్థానీలు హాజరైన సమావేశంలోనే రాహుల్ ఇలా వ్యాఖ్యానించారు. సిక్కులకు ముప్పుందన్న ఆయన మాటలు సాహసోపేతమైనవి. చారిత్రకంగా సరైనవే. వారికి ప్రత్యేక‌ దేశం ఉండాలన్న SFJ వైఖరిని సమర్థించినట్టైంది’ అని అన్నారు.