news

News September 19, 2024

పంత్‌తో డేటింగ్.. అవి రూమర్లే: ఊర్వశి

image

భారత క్రికెటర్ రిషభ్ పంత్‌తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నటి ఊర్వశీ రౌతేలా స్పష్టం చేశారు. ‘నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే ఉంది. పంత్‌ విషయంలో వచ్చినవన్నీ రూమర్లే. వాటిపై పారదర్శకత మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీమ్ పేజీలకు ఎందుకింత అత్యుత్సాహమో నాకు అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.

News September 19, 2024

పవన్‌తో ముగిసిన బాలినేని, సామినేని భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ ముగిసింది. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఉదయభాను ప్రకటించారు. జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్‌ను ఆహ్వానించి జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. అందరినీ కలుపుకుని ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

News September 19, 2024

వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR

image

AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 19, 2024

ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్

image

ప‌నిఒత్తిడి కార‌ణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘ‌ట‌న‌పై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగుల‌కు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థ‌లో బాధితురాలి ప్ర‌యాణం త‌క్కువ కాలంలోనే ముగిసింద‌ని, ఈ విష‌యంలో ఆమె త‌ల్లిదండ్రులు త‌న‌కు రాసిన లేఖ‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య‌క‌ర‌మైన, స‌మ‌తుల్య ప‌ని వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు.

News September 19, 2024

అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

News September 19, 2024

కొత్త స్టడీ: రోజూ 3 కప్పుల కాఫీతో లాభాలు

image

ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ/టీ తాగడం వల్ల గుండె, జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయ‌నం సూచిస్తోంది. చైనాలోని సూచౌ యూనివ‌ర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెస‌ర్‌ చౌఫు కే బృందం 1.80 ల‌క్ష‌ల మందిపై అధ్య‌య‌నం జరిపింది. మితంగా తీసుకొనే కెఫిన్ (3 కప్పుల కాఫీ/టీ) కార్డియోమెటబోలిక్ మల్టీమోర్బిడిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో సాయ‌ప‌డుతుందని వెల్ల‌డించింది.

News September 19, 2024

INDvBAN: అశ్విన్ సూపర్ సెంచరీ

image

బంగ్లాదేశ్‌తో తన హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నారు. కీలక ఆటగాళ్లు ఔటైన టైమ్‌లో 108 బంతుల్లో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నారు. ఇది ఆయనకు 6వ సెంచరీ కావడం విశేషం. అశ్విన్‌కు తోడుగా ఉన్న మరో ఆల్‌రౌండర్ జడేజా సైతం సెంచరీని(79) సమీపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి కౌంటర్ ఎటాక్‌కు బంగ్లా బౌలర్ల వద్ద సమాధానం కరవైంది.

News September 19, 2024

జానీ మాస్టర్ అరెస్టుపై స్పందించిన పోలీసులు

image

TG: అత్యాచారం ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. గోవాలో అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 2020లో లైంగిక దాడి చేశారని బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమె అప్పటికి మైనర్ కావడంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News September 19, 2024

సింగం అగైన్‌లో ‘చుల్‌బుల్ పాండే’

image

బాలీవుడ్‌ హిట్ ఫ్రాంచైజ్ సింగం అగైన్‌లో స‌ల్మాన్ ఖాన్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ద‌బాంగ్‌లో స‌ల్మాన్ చేసిన చుల్‌బుల్ పాండే పాత్రనే ఈ చిత్రంలో కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న అజ‌య్ దేవ‌గ‌ణ్, క‌రీనా, దీపిక, ర‌ణ్‌వీర్, అక్ష‌య్ కుమార్‌, జాకీ ష్రాఫ్‌, అర్జున్ క‌పూర్‌, టైగ‌ర్ ష్రాఫ్‌లకు తోడు స‌ల్మాన్ కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే.

News September 19, 2024

జగన్ నీ సంగతి స్వామే చూసుకుంటాడు: టీడీపీ

image

మాజీ CM YS జగన్‌‌పై టీడీపీ ట్విటర్‌లో మండిపడింది. స్వామి వారి విగ్రహాన్ని నల్ల రాయి అని పగలగొడతా అని చెప్పిన అన్యమతస్థుడైన భూమనకు TTD ఛైర్మన్ పదవి ఇచ్చారంటూ ఆరోపించింది. ‘ జగన్ రెడ్డీ.. తిరుమల గురించి నువ్వు, నీ సైకో బ్యాచ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత దుర్మార్గుడివి కాకపోతే తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతావా? ఆయన పవర్ తెలిసి కూడా ఆటలు ఆడావు. ఆయనే చూసుకుంటాడు’ అని హెచ్చరించింది.