news

News September 19, 2024

జమిలి ఎన్నికలపై పార్టీల స్టాండ్ ఏంటి?

image

జమిలి ఎన్నికలపై రాంనాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా 47 పార్టీలే స్పందించాయి. అందులో 32 అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. బీజేపీ, NPP, అన్నాడీఎంకే, అప్నాదళ్, అసోం గణ పరిషత్, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకించాయి. టీడీపీ, వైసీపీ, BRS స్పందించలేదు.

News September 19, 2024

దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్

image

US ఫెడ్ వ‌డ్డీ రేట్ల కోత‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎన‌ర్జీ, మోటార్‌, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాల‌తో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి.

News September 19, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.

News September 19, 2024

జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?

image

జమిలీ ఎన్నిక‌ల కోసం చేయాల్సిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌కు పార్ల‌మెంటులో 2/3 వంతు స‌భ్యుల ఆమోదం అవ‌స‌రం. NDAకి ప్ర‌స్తుతం ఉన్న మ‌ద్ద‌తు ఏ మాత్రం స‌రిపోదు. అద‌నంగా స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్‌స‌భ‌లో NDAకు 293 మంది స‌భ్యుల బలం ఉంటే, స‌వ‌ర‌ణ‌ల ఆమోదానికి 362 మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇక రాజ్య‌స‌భ‌లో 121 మంది బ‌లం ఉంటే, అద‌నంగా 43 మంది స‌భ్యుల బ‌లం అవ‌స‌రం ఉంది.

News September 19, 2024

జ‌మిలి ఎన్నిక‌ల కోసం చేయాల్సిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు

image

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ కాల‌ప‌రిమితికి సంబంధించిన ఆర్టిక‌ల్ 83, 83(2) *అసెంబ్లీల గ‌డువు కుదింపున‌కు ఆర్టికల్ 172 (1) *రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు వీలుక‌ల్పించే ఆర్టిక‌ల్ 356, ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ప‌రిధికి సంబంధించి ఆర్టిక‌ల్ 324 *లోక్‌స‌భ‌, అసెంబ్లీల ముందస్తు ర‌ద్దుకు రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్‌కు అధికారం క‌ల్పించే ఆర్టిక‌ల్ 83(2), 172(1)ను స‌వ‌రించాలి. ఈ సవరణలు ఆమోదం పొందితే తప్పా జమిలి ఎన్నికలు సాధ్యం కావు.

News September 19, 2024

CM రేవంత్‌కి రైతులంటే ఎందుకింత భయం: KTR

image

రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడాన్ని KTR ఖండించారు. రుణమాఫీ హామీ నిలబెట్టుకోవాలని రైతులు ‘చలో ప్రజాభవన్’కు పిలుపునిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ‘ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి. ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత భయం? ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు’ అని ట్వీట్ చేశారు.

News September 19, 2024

సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లపై ప్రభుత్వం మరో నిర్ణయం

image

న్యూస్ పేపర్ కొనుగోలు కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200 భత్యాన్ని రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏడాదికి రూ.102 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని CM చంద్రబాబు సూచించారు. మరోవైపు ‘సాక్షి’ పేపర్ కొనుగోలుతో రెండేళ్లలో రూ.205 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.

News September 19, 2024

అన్‌ఫిట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సింగరేణి సీఎండీ

image

TG: సింగరేణిలో అన్‌ఫిట్ పేరుతో కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని CMD బలరాం తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు నష్టం కలిగించేలా పనులు చేసే వారి సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి 9491144104కు కాల్ లేదా సంస్థకు మెయిల్ చేసి చెప్పాలని సూచించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇస్తామని ప్రకటించారు.

News September 19, 2024

జమిలికి గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే?

image

జమిలి ఎన్నికలను కేంద్రం ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, మూడేళ్లే అధికారంలో ఉంటాయి.

News September 19, 2024

తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు

image

TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.