India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WPL-2026లో ఇవాళ ఢిల్లీ, బెంగళూరు మధ్య వడోదర వేదికగా ఫైనల్ జరగనుంది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ తొలి టైటిల్పై కన్నేసింది. ఈ సీజన్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న RCB రెండో సారి ట్రోఫీ నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లు 9 సార్లు తలపడగా ఆరు విజయాలతో ఢిల్లీదే పైచేయిగా ఉంది. అయినా 2024 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడటం DCని కలవరపరుస్తోంది.
మ్యాచ్: 7.30pm, లైవ్: జియో హాట్స్టార్, Star Sports.

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన బాలీవుడ్ చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలవ్వగా 1.3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(1.25 కోట్లు), జవాన్(1.24 కోట్లు), స్త్రీ2(1.11 కోట్లు) ఉన్నాయి.

అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్, యూఎస్ ప్రతినిధుల భేటీకి తేదీ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మస్కట్లో చర్చలు జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ ట్వీట్ చేశారు. అంతకుముందు అణు ఒప్పందానికి రాకపోతే దాడి తప్పదని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఘాటుగానే <<19025631>>బదులిచ్చినా<<>> తాజాగా చర్చలకు అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.

✒1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒1990: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్(ఫొటోలో) జననం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

నైజీరియాలో మిలిటెంట్ దళాలు రెచ్చిపోయాయి. క్వారాలోని రెండు గ్రామాల్లో విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 162 మంది మరణించారు. ఈ మధ్య కాలంలో ఇవే అత్యంత ఘోరమైన దాడులని స్థానిక నేతలు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో అనుబంధంగా ఉన్న లకురావా ఈ ఘాతుకానికి తెగబడిందన్నారు. మిలిటరీ ఆపరేషన్కు వ్యతిరేకంగా సాయుధమూకలు ఈ దాడులకు పాల్పడుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతాలు కావడంతో చేరుకోవడం కష్టంగా మారిందన్నారు.
Sorry, no posts matched your criteria.