India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ధూమ్-4’లో తమిళ నటుడు సూర్య నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, స్ట్రాంగ్ విలన్ రోల్లో ఆయన కనిపిస్తారని టాక్. సూర్య ఇంతకు ముందు బాలీవుడ్ సినిమాలో నటించకపోవడం గమనార్హం. యశ్ రాజ్ బ్యానర్పై భారీస్థాయిలో ‘ధూమ్-4’ను రూపొందించనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
2020 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆరోజు రాత్రి తమ కోచ్ రవి శాస్త్రి పాటల కార్యక్రమం పెట్టారని స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. ‘అందరం చాలా దిగాలుగా ఉన్నాం. దాంతో రవి మాకు డిన్నర్ ఏర్పాటు చేశారు. సాంగ్ ట్రాక్స్ పెట్టి పాటలు పాడి మాతో పాడించారు. అందర్నీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాతి టెస్టులో ఘన విజయం సాధించగలిగాం’ అని గుర్తుచేసుకున్నారు.
స్కూల్ పిల్లలు ధరించేందుకు తక్కువ ధరలో వాచ్లను తీసుకురావాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. చాలా స్కూళ్లలో పిల్లలు ఫోన్ తీసుకురావడం నిషేధమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వాచ్ల ద్వారా పిల్లలు పాఠశాలల నిబంధనలకు లోబడే కనెక్టివిటీతో ఉంటారని సంస్థ భావిస్తున్నట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఈ వాచ్ను లాంచ్ చేసే అవకాశముందని పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్తో యుద్ధం విషయంలో తమకు భయం లేదని హమాస్ తాజాగా స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగించేందుకు అవసరమైన వనరులన్నీ తమకున్నాయని ధీమా వ్యక్తం చేసింది. ‘ఎన్నో త్యాగాలు జరిగాయి. ఎంతోమంది అమరులయ్యారు. కానీ వాటికి ఫలితంగా విలువైన యుద్ధ అనుభవాన్ని సంపాదించుకున్నాం. వాస్తవంగా ఇంతటి భారీ యుద్ధంలో వాటిల్లే స్థాయి మరణాలు మావైపు సంభవించలేదు’ అని సమర్థించుకొంది.
డ్రగ్స్ రిపోర్టులో తనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు ప్రసారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ‘ఇంకా ఛార్జ్షీటు నేనే చూడలేదు. మీడియాకు ఎలా వచ్చింది? ఈ వార్తలు చూసి నా తల్లి అనారోగ్యానికి గురైంది. నేనే మీడియా పెద్దల వద్దకు వస్తా. వారే టెస్టులు చేయించండి. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధం. నెగటివ్ వస్తే నాకు న్యాయం చేయాలి. పరువు కోసం చనిపోవడానికి సిద్ధం’ అని ఆమె స్పష్టం చేశారు.
TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు తెలిపాయి. అయితే, త్రివిక్రమ్ కాకుండా మరో డైరెక్టర్తో సినిమా రాబోతోందనేది పూర్తిగా అవాస్తవమని, వాటిని నమ్మొద్దని చెప్పాయి. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
AP: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్ని సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్లో తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న ఆచార్యులు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
US అధ్యక్ష అభ్యర్థి ట్రంప్పై హత్యాయత్నం జరగడం పట్ల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ‘బైడెన్, కమలను చంపాలని ఎవరూ కనీసం ప్రయత్నించడం లేదు’ అని సమాధానమిచ్చారు. ట్రంప్కు మస్క్ చాలాకాలంగా బహిరంగంగానే మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. అటు ట్రంప్ 2సార్లు ప్రమాదాన్ని తప్పించుకోవడంతో అమెరికావ్యాప్తంగా ఆయనకు సానుభూతి పెరుగుతోంది.
లైంగిక సంబంధానికి మహిళ అంగీకారం ఉన్నప్పటికీ అది భయంతో లేక తెలియనితనంతో కూడినదైతే ఆ సంబంధం అత్యాచారం కిందకే వస్తుందని అలహాబాద్ కోర్టు తేల్చిచెప్పింది. తన ఇష్టం లేకుండా భర్త అత్యాచారం చేశాడంటూ ఓ భార్య పెట్టిన కేసును సదరు భర్త న్యాయస్థానంలో సవాలు చేశారు. అతడి పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. స్త్రీ భయంతో ఒప్పుకొంటే అది ఆమె శృంగారానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.