news

News September 16, 2024

ఇండియాలో ఎక్కువ మందికి ఉన్న చివరి పేరు ఇదే!

image

ఒకరిని పోలిన వ్యక్తులు భూమిపై ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఒకే పేరును కలిగిన వాళ్లు వేలల్లో ఉంటారు. అయితే, ఇండియాలో ఎక్కువ మంది తమ చివరి పేరును కుమార్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. అర్జెంటీనాలో గొంజాలెజ్, ఆస్ట్రేలియాలో స్మిత్, బంగ్లాదేశ్‌లో అక్తర్, బ్రెజిల్‌లో డా సిల్వా, కెనడాలో స్మిత్, చైనాలో వాంగ్, ఈజిప్టులో మొహమ్మద్, ఫ్రాన్స్‌లో మార్టిన్ అనే పేర్లు కామన్‌గా పెట్టుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది.

News September 16, 2024

నేడు కొరియాతో టీమ్ ఇండియా సెమీస్ పోరు

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఈరోజు సెమీస్ మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొరియాతో ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఐదింటికి ఐదు మ్యాచులనూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన సునాయాసంగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అటు పాక్ కూడా సెమీస్ చేరి ఈరోజు చైనాతో తలపడుతోంది. ఈ నెల 17న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

News September 16, 2024

సీఎం రేవంత్ నన్ను చంపాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే కౌశిక్

image

TG: తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలి. హామీల అమలు గురించి అడిగితే దాడి చేయిస్తున్నారు. దాడి చేయించానని స్వయంగా ఆయనే చెప్పారు. రేవంత్‌కు నేను భయపడను. చావడానికైనా సిద్ధం. దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.

News September 16, 2024

కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్య

image

AP: నామినేటెడ్ పదవుల భర్తీని NDA కూటమి ప్రారంభించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ IAS అయిన కృష్ణయ్య మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో APIIC ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

News September 16, 2024

హీరో దర్శన్ అంతకుముందు ఉన్న జైలులో ఫోన్లు, కత్తులు

image

హత్య కేసులో అరెస్టయిన సినీ హీరో దర్శన్‌కు VIP ట్రీట్‌మెంట్ ఇచ్చిన బెంగళూరు జైలులో పోలీసులు తాజాగా రైడ్ చేశారు. 15 ఫోన్లు, ₹1.3లక్షల విలువైన శామ్‌సంగ్ డివైస్, 7 ఎలక్ట్రిక్ స్టవ్‌లు, 5 కత్తులు, 3 ఫోన్ ఛార్జర్లు, పెన్ డ్రైవ్‌లు, ₹36,000 నగదు, సిగరెట్, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. VIP ట్రీట్‌మెంట్ విషయం వివాదంగా మారడంతో దర్శన్‌ను బళ్లారి జిల్లా జైలుకు మార్చిన సంగతి తెలిసిందే.

News September 16, 2024

ట్రక్కు డ్రైవర్‌తో కూడా గంభీర్ గొడవపడ్డారు: చోప్రా

image

టీమ్ ఇండియా కోచ్ గంభీర్‌ గ్రౌండ్‌లోనే కాక ఎక్కడైనా గొడవకు రెడీగానే ఉంటారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపారు. ‘గంభీర్‌ చాలా త్వరగా సహనాన్ని కోల్పోతారు. ఢిల్లీలో ఓసారి ఓ ట్రక్కు డ్రైవర్ రాంగ్ రూట్‌లో వచ్చాడు. పైపెచ్చు గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. దీంతో కారు దిగి ట్రక్కు పైకి ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకుని గొడవపడ్డారు. తేడా వస్తే గంభీర్‌తో అలాగే ఉంటుంది’ అని వివరించారు.

News September 16, 2024

5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.160 పెరిగి రూ.75,050కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.150 పెరిగి రూ.68,800 పలుకుతోంది. గత 5 రోజుల్లో ధర ఏకంగా రూ.1750 పెరిగింది. ఇక వెండి ధర కేజీ మరో రూ.1,000 పెరిగి రూ.98వేలకు చేరింది. 5 రోజుల్లో వెండి ధర రూ.6,500 పెరగడం గమనార్హం.

News September 16, 2024

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీ ఖర్చు పెంచలేదు: రైల్వే శాఖ

image

కాంట్రాక్టర్ల కోసం వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీ ఖర్చును కేంద్రం 50% పెంచిందని TMC MP సాకేత్ ట్వీట్ చేశారు. ‘ఉన్నట్టుండి రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కి తగ్గించారు. ఒక్కో ట్రైన్ కాస్ట్‌ను ₹290cr నుంచి ₹436crకు పెంచారు’ అని ఆరోపించారు. దీనిపై రైల్వే శాఖ స్పందిస్తూ ‘రైళ్లను తగ్గించి ఒక్కో రైలుకు కోచ్‌లను 16 నుంచి 24కు పెంచాం. దీని వల్ల కాంట్రాక్టు వాల్యూ తగ్గింది కానీ పెరగలేదు’ అని తెలిపింది.

News September 16, 2024

పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి(PHOTOS)

image

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News September 16, 2024

నీరజ్ చోప్రా తాజా ట్వీటుకు మనూ భాకర్ స్పందన ఏంటంటే?

image

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని షూటర్ మనూ భాకర్ ఆకాంక్షించారు. డైమండ్ లీగులో రజతంతో 2024లో ఈ సీజన్‌ను అద్భుతంగా ముగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సీజన్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే ద్వారా తెలిసింది. మీ సపోర్టుకు థాంక్స్’ అన్న నీరజ్ ట్వీటుకు మను స్పందించడం నెటిజన్లను ఆకర్షించింది.