India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

<

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 133.20 పాయింట్లు నష్టపోయి 25,642.80 వద్ద, సెన్సెక్స్ 503.76 పాయింట్లు కోల్పోయి 83,313.93 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ప్రారంభంలో 25,755.90 వద్ద ఉన్న నిఫ్టీ ఒక దశలో 25,579.50కి పడిపోయినా తరువాత కాస్త కోలుకుంది. ట్రెంట్, టాటా స్టీల్, SBIN, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడయ్యాయి.

TG: వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో 39 నాన్-టీచింగ్ పోస్టుల దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 8తో ముగియనుంది. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత ఉండాలి. జీతం రూ.50వేలకు పైగానే ఉంది. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం ఇక్కడ <

మేకప్లో ముఖ్యమైన పార్ట్ అయిన ఫౌండేషన్ ఎంపికలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ముఖం డల్గా మారుతుందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్న టిప్స్ పాటించాలి. మీ షేడ్ కన్నా లైటర్ షేడ్ ఎంచుకుంటే ఫ్లేకీగా కనిపిస్తుంది. స్కిన్ కేర్, ఫౌండేషన్ సేమ్ బేస్డ్వి తీసుకోవాలి. కొన్ని ఫౌండేషన్స్ స్కిన్ ఆయిల్స్తో కలిసి టైమ్ గడిచేకొద్దీ ఆక్సిడేషన్ చెందుతాయి. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.

తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడుకు ప్రత్యేక స్థానం ఉంది. పొద్దుతిరుగుడులో NDSH-1, DRSH-1, KBSH-44 వంటి రకాలు సాగుకు అనువైనవి. అయితే NDSH-1012 అనే హైబ్రీడ్ రకం హెక్టారుకు 18-20 క్వింటాళ్ల దిగుబడినిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిలో నూనె శాతం 40-41%. ఇది బూజుతెగులును తట్టుకుంటుంది. ఈ విత్తనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం నంద్యాలలో అందుబాటులో ఉంటుంది.

ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయని, లోక్సభలోకి రావద్దని PM మోదీకి తాను సూచించినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. కొందరు MPలు లోక్సభ ఛాంబర్లో దురుసుగా ప్రవర్తించారన్నారు. ‘<<19056579>>మోదీ ప్రసంగాన్ని<<>> అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని, ఊహించని పరిస్థితికి దారితీయొచ్చని సమాచారం వచ్చింది. అదే జరిగుంటే దేశ గౌరవం దెబ్బతినేది. నిన్నటి ఘటన పార్లమెంటు చరిత్రలో మాయనిమచ్చ’ అని అన్నారు.

శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి రెండో కేసులోనూ బెయిల్ వచ్చింది. అతడిని అరెస్టు చేసి 90 రోజులైనా SIT ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో కేరళ కోర్టు statutory bail మంజూరు చేసింది. ద్వారపాలక విగ్రహం, గర్భగుడి తలుపుల ఫ్రేమ్స్లో బంగారం మాయంపై 2కేసులు అతడిపై నమోదయ్యాయి. దర్యాప్తులో తప్పు జరుగుతోందన్న తమ ఆరోపణలు ఈ బెయిల్తో నిజమని తేలాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

సంకటహర చతుర్థి ఎంతో విశిష్ఠమైందని పండితులు చెబుతున్నారు. ‘ఇవాళ విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని భక్తితో పూజిస్తే జీవితంలోని సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం(నీళ్లు) సమర్పించాలి. తర్వాత గణేశుడిని పూజించుకోవాలి. కచ్చితంగా చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించుకోవాలి. ఇలా చేస్తే మనో ధైర్యం పెరిగి, బుద్ధి వికసిస్తుంది’ అని చెబుతున్నారు.

<

AP: స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు దక్కనున్నాయి. అర్హతలు, సీనియార్టీ, పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు ఇవ్వనుంది. అలాగే రేషనలైజేషన్ పూర్తి చేసి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో వీరిని నియమించాలని భావిస్తోంది. ఆఫీసుల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించనుంది. దీనివల్ల ఉద్యోగులకు మేలు చేకూరి ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.