India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 200 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పాసైనవారు అర్హులు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. OBC/EWS/UR అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రూ.1,180(మిగతా కేటగిరీలకు మినహాయింపు). CBT ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
TG: బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కొందరు జంక్ ఫుడ్ కనిపిస్తే చాలు తినేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్లో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. అలాగే డెయిరీ పదార్థాలు, గుడ్లు ఎక్కువగా తిన్నా జంక్ ఫుడ్పైకి మనసు వెళ్లదు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినాలనే కోరికలు నియంత్రణలో ఉంటాయి.
AP: PM మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా IAS వీరపాండ్యన్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.
RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.
జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <
కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.
అడవికి రారాజు సింహమే అయినా ఆహారం కోసం అది వేటాడాల్సిందే. ఈ ప్రక్రియలో ఒక్కోసారి అవి తీవ్రంగా గాయపడిన పరిస్థితులూ ఉన్నాయి. మనుగడ కోసం జరిగిన ఘర్షణలో గాయపడిన ఓ సింహపు ఫొటోలను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్మన్ సింగ్ హీర్ క్లిక్మనిపించారు. తలపై గాయాలు, ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని కనిపించింది. అడవిలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో సింహాలు ఎంతలా గాయపడతాయో ఈ ఫొటోల్లో చూపించారు.
తన ప్రియురాలు తనకంటే 22 ఏళ్లు పెద్దదని తెలియడంతో ఓ యువకుడు SMలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాకు 26 ఏళ్లు. నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నా. కొన్ని రోజుల క్రితం ఆమె వయసు 27 కాదు, 48 అని తెలిసింది. ఆమె అంత వయసైనట్లు కనిపించదు. ఆమె స్నేహితులు 30+ వాళ్లే ఉండేవాళ్లు. ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే ఇచ్చేది కాదు. ల్యాప్టాప్లో పాస్పోర్టు చూడటంతో ఇది తెలిసింది. నేనిప్పుడు ఏం చేయాలి?’ అని అతను వాపోయాడు.
Sorry, no posts matched your criteria.