India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశం అంతటా VoNR (Voice over 5G) సేవలను JIO యాక్టివేట్ చేసింది. ఇప్పటివరకూ VoLTE ఉండగా ప్రస్తుతం 5G నెట్వర్క్పై పనిచేసే VoNR అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల నెట్వర్క్ వీక్గా ఉన్నప్పుడు 5G నుంచి 4Gకి మారడం లాంటి సమస్యలు ఉండవు. కాల్ నాణ్యత మెరుగవుతుంది. స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. బ్యాటరీ ఆదా అవుతుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ వేగం తగ్గదు.
AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.
TG: గంగా, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు కానీ తాము మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని సీఎం <<17649892>>రేవంత్<<>> రెడ్డి ప్రశ్నించారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. ఇందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నా. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది’ అని స్పష్టం చేశారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది.
AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 841 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 410 AAO (స్పెషలిస్ట్), 350 AAO (జనరలిస్ట్), 81 ఏఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హత కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.88,635 నుంచి రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. <
TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.
AP: రాష్ట్రంలో రబీ సీజన్కు సంబంధించి యూరియా పంపిణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సమస్య లేకుండా చూడాలని, దీనిపై రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ‘క్వింటా ఉల్లి ధర రూ.1,200కు తగ్గకూడదు. రూ.1,200కు తగ్గితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అరకు కాఫీ తోటల్లోని బెర్రీ బోరర్ తెగులు ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.
TG: రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల్లో MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన CPGET (Common Post Graduate Entrance Tests-2025) ఫలితాలు విడుదలయ్యాయి. <
రాధాకృష్ణన్(ఎన్డీఏ అభ్యర్థి): బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన-షిండే, YCP, LJP, అన్నాడీఎంకే(పళనిస్వామి), JDS, జనసేన, RLD, అప్నాదళ్, NCP(అజిత్ పవార్), SKM, స్వతంత్రులు.
సుదర్శన్ రెడ్డి (ఇండీ కూటమి): కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, TMC, ఆప్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), NCP(శరద్ పవార్), RJD(లాలూ), CPM, CPI, ఎంఐఎం.
* బీఆర్ఎస్(4), బీజేడీ(7) దూరం.
Sorry, no posts matched your criteria.