news

News February 5, 2026

భారీ జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

image

సుప్రీంకోర్టులో 90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, ఇంటిగ్రేటెడ్ లా అర్హతతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.100000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in/

News February 5, 2026

బూతుపాట వివాదం.. సినీ హీరోపై కేసు నమోదు

image

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో చంద్రహాస్‌పై HYD మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ బూతు పదాలతో రాసిన పాట పాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయగా, చంద్రహాస్ ఆయన్ను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, చంద్రహాస్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 5, 2026

రేపు ఆర్బీఐ రెపో రేటు ప్రకటన

image

RBI రేపు ప్రకటించనున్న రెపో రేటు కోసం మార్కెట్‌ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. RBI గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైన MPC భేటీ (మానిటరీ పాలసీ కమిటీ) శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించనుంది. GDP వృద్ధి రేటు జోరు మీద ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. రెపో రేటు తగ్గితే సామాన్యుడికి లాభం కలుగుతుంది. ఇల్లు, వాహనం, పర్సనల్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గుతాయి.

News February 5, 2026

AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

image

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.

News February 5, 2026

బంధంలో ఇది ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News February 5, 2026

గొడవలు ఎందుకొస్తాయంటే?

image

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

News February 5, 2026

JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<>JIPMER<<>>) 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM, MD, MCh అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. FEB 24న మెరిట్ లిస్ట్ ప్రకటించి, FEB 27న ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in

News February 5, 2026

ఇండియాకు ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనే స్వేచ్ఛ ఉంది: రష్యా

image

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో భాగంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఇండియా ఆపేస్తుందన్న వార్తలపై మాస్కో సానుకూలంగా స్పందించింది. ‘ప్రపంచవ్యాప్తంగా మాతో పాటు చాలా మంది చమురు ఎగుమతిదారులు ఉన్నారు. ఢిల్లీకి రష్యా మాత్రమే సప్లయర్ కాదు. ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనే స్వేచ్ఛ ఇండియాకు ఉంది. ఈ డీల్‌ను మేమేమీ కొత్తగా చూడట్లేదు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

News February 5, 2026

దివ్యాంగులకు ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ సైకిళ్లు

image

TG: దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఇందుకోసం OBMMS <>పోర్టల్‌<<>>లో ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో అప్లై చేసి పరికరాలు పొందని వారూ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9959583502 నంబర్(10am-6pm)లో సంప్రదించాలన్నారు.

News February 5, 2026

25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: కాగ్నిజెంట్

image

IT సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది దాదాపు 25K మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. 2025లో 20K మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, ఈ సంఖ్యను 20 శాతం మేర పెంచుతామని సంస్థ CEO రవికుమార్ తెలిపారు. AI ద్వారా ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామన్నారు. IITలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా ప్రోగ్రామర్లు, ఇంజినీర్లను తీసుకుంటామని పేర్కొన్నారు.