news

News September 8, 2025

ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం

image

TG: ఎరువుల సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఫైరయ్యారు. తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమని తెలిపారు.

News September 8, 2025

రూ.20 కోట్ల విలువైన వాచ్ ధరించిన పాండ్య

image

టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్‌లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.

News September 8, 2025

ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

image

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆధార్ కార్డు జెన్యూన్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. దీనిని 12వ డాక్యుమెంట్‌గా పరిగణించాలని పేర్కొంది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.

News September 8, 2025

IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

image

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <>బదిలీ<<>> చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌, GAD సెక్రటరీగా శ్యామలారావు, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముకేశ్ కుమార్ మీనా, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్‌ను నియమించింది.

News September 8, 2025

ఆస్ట్రేలియాలో ఈ వస్తువులకు నో ఎంట్రీ

image

మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి <<17646725>>నవ్య నాయర్‌<<>>కు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులు ఫైన్ విధించారు. అక్కడికి పువ్వులు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ముడి గింజలు, పాల ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామూన్, రస్ మలై, బియ్యం, టీ, తేనె, హోమ్ ఫుడ్, పెట్స్ ఫుడ్, పక్షులు, పక్షుల ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, మేపుల్ సిరప్ తీసుకెళ్తే రూ.1,54,316 వరకు ఫైన్ విధిస్తారు.

News September 8, 2025

హిందీ తప్పనిసరని ఎక్కడా చెప్పలేదు: లోకేశ్

image

AP: కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(NEP)లో హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. తానూ 3 భాషలు నేర్చుకున్నట్లు ఇండియా టుడే సదస్సులో చెప్పారు. చదువుపై రాజకీయాల ప్రభావం పడకూడదని అభిప్రాయపడ్డారు. నేటి తరం పిల్లలు ఐదేసి భాషలు నేర్చుకుంటున్నారని, ఎక్కువ భాషలతో విదేశాల్లో పనిచేసేందుకు వీలుంటుందన్నారు.

News September 8, 2025

పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం

image

TG: అంగన్‌వాడీలకు పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించిన ఆమెకు గతనెల 58% మాత్రమే పాలు సరఫరా అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి రిపీట్ కావొద్దని, పాలతో పాటు గుడ్లు, పప్పు, ఇతర ఆహార పదార్థాలు సక్రమంగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రతి 10 రోజులకోసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని, లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

News September 8, 2025

పొలాల శత్రువు.. వయ్యారిభామ(1/3)

image

పంట పొలాల్లో అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే మొక్క పార్థీనియం(వయ్యారిభామ). ఇది వాతావరణ అనుకూల పరిస్థితుల్లో 4 వారాల్లో పుష్పించి దాదాపు 10K-50K వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గాలి ద్వారా 3KM దూరం వరకు విస్తరించి మొలకెత్తుతాయి. భూమి నుంచి నత్రజనిని వేర్ల ద్వారా గ్రహించే శక్తి ఇతర మొక్కలతో పోలిస్తే వయ్యారిభామకు 10 రెట్లు ఎక్కువ. ఇది మొలిచిన చోట్ల పైరుల ఎదుగుదల ఆగిపోతుంది.

News September 8, 2025

వయ్యారిభామ కట్టడి మార్గాలు(3/3)

image

* ఇవి తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడే పీకివేసి తగలబెట్టాలి.
* పంట మొలకెత్తక ముందు లీటర్ నీటికి 4 గ్రాముల అట్రాజిన్, మొలకెత్తిన 20 రోజులకు 2,4-D సోడియం సాల్ట్ లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించుకోవచ్చు.
* ఈ మందులు పక్క పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి.
* కసివింద, వేంపల్లి, తోటకూర, పసర కంప మొదలైన మొక్కలు పార్థీనియం మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి.

News September 8, 2025

వయ్యారిభామ వలన కలిగే నష్టాలు(2/3)

image

☛ ఈ కలుపు మొక్క పంట పొలాల్లో 40% దిగుబడి, పశుగ్రాసాల్లో 90% దిగుబడి తగ్గిస్తుంది.
☛ ఈ మొక్క ఉత్పత్తి చేసే పుప్పొడి టమాట, మిరప, వంగ, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటి ఉత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
☛ దీని పుప్పొడిని పీలిస్తే మనుషులకు డెర్మటైటిస్, ఎగ్జిమా, ఉబ్బసం, తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం, శ్వాసనాళాల్లోకి వెళ్లి బ్రాంకైటిస్ లాంటి వ్యాధులను కలుగజేస్తుంది.