India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలిడేస్ అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయని అందులో పేర్కొంది. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది. అటు జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
AP: లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ చేపట్టిన HC బెయిల్పై విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ACB కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. మిగిలిన నిందితులకు ఇలా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.
ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత రికార్డు సృష్టించారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్-21 ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించారు. TSలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తండ్రి ఆధ్వర్యంలోనే శిక్షణ పొందారు. ఈమె ఇప్పటికే పలుజాతీయస్థాయి పతకాలు సొంతం చేసుకున్నారు.
TG: ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ.30వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, FDలు చేయండంటూ వారిని ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి’ అని సూచించారు.
* రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఈ రాత్రికి ఢిల్లీకి TG సీఎం రేవంత్
* యూరియాపై ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు: అచ్చెన్న
* గుంటూరు తురకపాలెంలో HYD శ్రీబయోటెక్ శాస్త్రవేత్తల బృందం పర్యటన
* యూరియా కోసం సిద్దిపేటలో రైతుల ఆందోళన.. హైవేపై ట్రాఫిక్ జామ్
* భారత మెన్స్ హాకీ జట్టుకు అభినందనలు: మంత్రి మండిపల్లి
* వరంగల్ (D) మామునూరులో ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్.. TG, AP, బిహార్, ఝార్ఖండ్ NCC విద్యార్థులు హాజరు
బ్యాగులో మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా వెళ్లిన మలయాళ నటి నవ్య నాయర్కు మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ అధికారులు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఓనం కార్యక్రమంలో పాల్గొనేందుకు మెల్బోర్న్ వెళ్లగా ఎయిర్పోర్ట్ చెకింగ్లో మల్లెపూలు కనిపించాయి. ఇది బయో సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమంటూ ఫైన్ వేశారు. పండ్లు, పూలు, విత్తనాల రవాణాతో ప్రయాణికులకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ చట్టాలు రూపొందించారు.
IPL ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్పై మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు. టోర్నీ పాపులారిటీకి ఎంతో కృషి చేసినా, ఫ్రాంచైజీకి విలువ తేగల నన్ను చిన్నపిల్లాడిలా చూశారు. జీవితంలో ఫస్ట్ టైమ్ డిప్రెషన్లోకి వెళ్లా. కుంబ్లేతో మాట్లాడినప్పుడు ఏడ్చేశా’ అని చెప్పుకొచ్చారు. రాహుల్ తనను జట్టులోనే ఉండాలని చెప్పాడని, కానీ బ్యాగ్ సర్దుకొని వచ్చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
విటమిన్ A- క్యారెట్లు, కాలేయం. B1 – తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2 – పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశనగ. B5 – అవకాడో, గుడ్లు. B6 – అరటిపండు, సాల్మన్ చేప, ఆలుగడ్డలు. B7 – గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B9 – ఆకుకూరలు, పప్పులు, సిట్రస్. B12 – చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. విటమిన్ D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్. E – పొద్దుతిరుగుడు గింజలు, బాదం. C – నారింజ, జామ. SHARE IT
AP: ఆల్ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నిన్న CS, DGP, CMO అధికారులతో CM చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. JCల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు.. SPల నుంచి DIG, IGల వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశముందని చెబుతున్నాయి. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం CM కసరత్తు చేస్తున్నారని పేర్కొంటున్నాయి.
TG: CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘BJP అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది’ అని గతేడాది మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై TG BJP వేసిన పిటిషన్ను SC డిస్మిస్ చేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని CJI గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ పిటిషన్ను గతంలో HC కొట్టేయగా BJP నేత కాసం వెంకటేశ్వర్లు SCలో సవాల్ చేశారు.
Sorry, no posts matched your criteria.