news

News April 24, 2025

జమ్మూ ఎన్‌కౌంటర్ Live Update: భారత జవాన్ వీర మరణం

image

జమ్మూ కశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. అక్కడ ముష్కరులు ఉన్నారని సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ సోల్జర్ వీర మరణం పొందారని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

News April 24, 2025

GOVT SCHOOL విద్యార్థుల సత్తా.. 42 మందికి 500+ మార్కులు

image

AP: కర్నూలులోని ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ స్కూల్ టెన్త్ ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగోసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. 43 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 42 మంది 500కు పైగా మార్కులు సాధించారు. ఒక్క విద్యార్థికి 491 వచ్చాయి. సాయి లిఖితకు అత్యధికంగా 595 మార్కులు వచ్చాయి. 9 మంది 580-591 మధ్య మార్కులు పొందారు. కాగా ఈ స్కూల్‌ పలుమార్లు ఉత్తమ పాఠశాలగా నిలిచింది.

News April 24, 2025

ఉగ్రదాడి.. కలిమా చదివి తప్పించుకున్నాడు!

image

కలిమా చదవడంతో పహల్‌గామ్ ఉగ్రదాడి నుంచి అస్సాం వర్సిటీ ప్రొఫెసర్ దేబాశిష్ తప్పించుకున్నారు. ఫ్యామిలీతో టూర్‌కు వెళ్లిన ఆయన మాటల్లో.. ‘చుట్టూ జనాలు పడిపోతుండగా పక్కన కొందరు ‘కలిమా (ఇస్లాంపై విశ్వాస వాక్యం)’ చదువుతున్నారు. వారిని చూసి నేనూ అలా చదివాను. నా పక్కన వ్యక్తిని కాల్చిన టెర్రరిస్ట్.. నన్ను డౌట్‌తో మళ్లీ కలిమా చెప్పమన్నాడు. వణుకుతూనే చదివిన తర్వాత నన్ను వదిలేసి ముందుకెళ్లారు’ అని వివరించారు.

News April 24, 2025

కర్రెగుట్టలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. హిడ్మా, దేవా వంటి అగ్ర కమాండర్లు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని 3వేలకు పైగా బలగాలు చుట్టుముట్టాయి. నేలమీది నుంచి, గగనతలం నుంచి ముమ్మర కూంబింగ్‌తో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఈక్రమంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోలు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

News April 24, 2025

పాములాంటి పాకిస్థాన్‌తో ఒప్పందం.. MP సంచలన వ్యాఖ్యలు

image

సింధు నది జలాల నిలిపివేతతో పాకిస్థాన్ అల్లాడిపోతుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అన్నారు. దివంగత ప్రధాని నెహ్రూ పాకిస్థాన్‌కు నీరు ఇస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని ఆశపడి పాము లాంటి ఆ దేశానికి సింధు జలాలను తరలించారన్నారు. PM మోదీ ఆ ఒప్పందాన్ని నిలిపివేసి, ఏమీ అందకుండా దెబ్బ కొట్టారని చెప్పారు. 52ఇంచుల ఛాతీ ఉన్న ధీరుడి నిర్ణయాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయని మోదీని ఉద్దేశించి ప్రశంసించారు.

News April 24, 2025

ఆఫీస్‌కు వస్తారా.. మానేస్తారా?.. గూగుల్ అల్టిమేటం

image

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఆఫీస్‌కు వస్తారా లేక పూర్తిగా మానేస్తారా అని ప్రశ్నిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేయాలని, ఇంటి నుంచే పనిచేస్తామంటే కుదరదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఏఐకి ప్రాధాన్యాన్ని ఇస్తున్న గూగుల్ ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించింది.

News April 24, 2025

వక్ఫ్ నిరసనలకు తాత్కాలిక బ్రేక్: ముస్లిం లా బోర్డు

image

పహల్గాం ఉగ్రదాడిపై ఆలిండియా ముస్లిం లా బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘పహల్గాం దాడి చాలా విషాదకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలను 3రోజుల పాటు ఆపుతున్నాం’ అని ప్రకటించింది.

News April 24, 2025

OTTలోకి కొత్త సినిమాలు

image

ఇటీవల థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు OTTలో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ పార్ట్-2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో, మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’ జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్, సైఫ్ అలీఖాన్ ‘జ్యువెల్ థీఫ్’ అందుబాటులోకి రానున్నాయి.

News April 24, 2025

పాక్‌పై భారత్ ఆంక్షలు.. నష్టాల్లో మార్కెట్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ కఠిన ఆంక్షలు విధించడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టపోయి 79,891 వద్ద ట్రేడ్ అవుతోంది. నిప్టీ 50 పాయింట్లు కోల్పోయి 24,278 వద్ద కొనసాగుతోంది.

News April 24, 2025

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

image

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బేస్ క్యాంపుల నుంచి అక్కడకు భారీగా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
——
☞ ఇది ఇప్పుడే అందిన ఇన్‌పుట్. వచ్చే మరిన్ని వివరాల ప్రకారం ఈ ఆర్టికల్ సమాచారం అప్‌డేట్ చేస్తాము.