India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ RCB, RR మధ్య బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచులు ఆడగా RCB 16, రాజస్థాన్ 14 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు (10pts) నాలుగు, RR ఎనిమిదో (4pts) స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు RCB తన సొంత గ్రౌండ్లో గెలవలేదు. అటు RR గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతులా ఓడుతోంది. ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచుకూ దూరం కానున్నట్లు సమాచారం.
పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్ప్రదేశ్లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్తో బార్డర్ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్లలో 46సార్లు ఓడిపోయింది.
AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో కోలీవుడ్లోనూ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్లో ఆమె ఓ వెబ్ సిరీస్లో నటిస్తారని తెలుస్తోంది. ఇది మహిళలపై అణచివేత, సామాజిక సమస్యలే కథాంశంగా రూపొందుతుందని టాక్. జులైలో షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.3శాతానికి పరిమితం కానున్నట్లు ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా ఏర్పడ్డ విధాన అనిశ్చితి, ఆర్థిక బలహీనతల కారణంగా ఈ ఏడాది వృద్ధి మందగించనున్నట్లు పేర్కొంది. ఇది వరకు భారత వృద్ధిరేటు 6.7శాతం ఉండవచ్చని అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం 6.3శాతానికి కుదించింది. కాగా IMF భారత వృద్ధి రేటు 6.2శాతం ఉండనున్నట్లు పేర్కొంది.
AP: టెన్త్ పరీక్షల్లో పలువురు విద్యార్థులు మార్కుల సునామీని సృష్టించారు. కాకినాడకు చెందిన <<16188784>>నేహాంజనికి<<>> 600కు 600 మార్కులు రాగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు 599 మార్కులు సాధించారు. వారిలో లిఖిత(విశాఖ), తన్వి(పెందుర్తి), అనీషా(ఎలమంచలి), ప్రేమసత్య లిఖిత(పిఠాపురం), హర్షిత్(బొమ్మూరు), షేక్ హిష్రత్(నంద్యాల) ఉన్నారు. మరో 14 మందికి 598 మార్కులు వచ్చాయి.
TG: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చే నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. HYDలో నిర్మించిన గోల్నాక, BHEL ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభిస్తారు. అలాగే నల్గొండ చుట్టూ రూ.516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకు, హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఆయన చేయాల్సిన సినిమాల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పవర్ స్టార్ తాజాగా నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రీమూవీ మేకర్స్, డీవీవీ దానయ్యతో భేటీ అయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తానని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తొలుత హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ, చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తవుతాయని టాక్.
బంగారం ధరలు పెరగడం రిటైల్ మార్కెట్లో ఆభరణాల కొనుగోలుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ధరలు హెచ్చువల్ల నగల అమ్మకాలు 9నుంచి 11శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. అయితే విక్రయ సంస్థల ఆదాయం మాత్రం 13నుంచి 15శాతం పెరగొచ్చని పేర్కొంది. 2024-25లో భౌగోళిక, రాజకీయ ఆందోళనలతో పసిడి ధరలు 25శాతం పెరిగాయి. ఫలితంగా రిటైలర్ల అమ్మకాలు 4-5శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
Sorry, no posts matched your criteria.