news

News March 16, 2024

జగన్, చంద్రబాబు ఢిల్లీలో మోదీ పక్కనే: సీఎం రేవంత్

image

ఏపీలో పాలకులు ఢిల్లీలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. ‘ఇక్కడి 25 ఎంపీ స్థానాలు మోదీ ఖాతాలోనే ఉంటాయి. జగన్, చంద్రబాబు రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నా.. ఢిల్లీలో మోదీ పక్కనే ఉంటారు. వారిద్దరూ పాలించాలనుకుంటున్నారు గానీ ప్రశ్నించాలనుకోవట్లేదు. ఈ ప్రాంత సమస్యల మీద పోరాడే నాయకులు కావాలి’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

ఏపీలోని మొత్తం ఓటర్లు 4.08 కోట్లు

image

➣రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య: 4,08,07,256
➣175 నియోజకవర్గాల్లో రిజర్వ్‌డ్ స్థానాలు: లోక్‌సభ(4 ఎస్సీ, ఒక ఎస్టీ), అసెంబ్లీ(29 ఎస్సీ, 7 ఎస్టీ)
➣పురుష ఓటర్లు: 2 కోట్లకుపైగా ➣మహిళా ఓటర్లు: 2.07 కోట్లకుపైగా
➣థర్డ్ జెండర్: 3,482 ➣సర్వీస్ ఓటర్లు: 67,434 ➣NRI: 7,603
➣మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు(PS):178 ➣యువతతో నిర్వహించే PSలు: 50 ➣555 ఆదర్శ PSలు.

News March 16, 2024

సీఎం జగన్‌పై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు

image

AP: దివంగత వైఎస్సార్ సంకల్పం నిలబెట్టినవాళ్లే ఆయన వారసులు అవుతారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయినవారు ఆయన వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ షర్మిల నడుంబిగించారని కొనియాడారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకే పోతారని మండిపడ్డారు.

News March 16, 2024

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడికి జైలు శిక్ష

image

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఓయోంగ్ సు(79)ను లైంగిక వేధింపుల కేసులో సౌత్ కొరియా పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు తేలడంతో కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. 40 గంటలపాటు లైంగిక వేధింపుల ట్రీట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని ఆదేశించింది.

News March 16, 2024

IPL టికెట్ల అమ్మకం షురూ

image

హైదరాబాద్‌లో జరగబోయే IPL తొలి మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు <>పేటీఎం ఇన్‌సైడర్‌<<>>లో అందుబాటులోకి వచ్చాయి. టికెట్ల కనిష్ఠ ధర రూ.1500లుకాగా గరిష్ఠ ధర రూ.30 వేలుగా ఉంది. ఇక ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక ఫ్యాన్ జెర్సీ ఉచితంగా పొందవచ్చని SRH బంపర్ ఆఫర్ ప్రకటించింది.

News March 16, 2024

పదేళ్లయినా రాజధాని ఎక్కడో చెప్పలేకపోతున్నారు:రేవంత్

image

AP: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు’ అని విమర్శించారు.

News March 16, 2024

ప్రజా తీర్పునకు కౌంట్‌డౌన్ @79

image

జూన్ 4.. రాజకీయ నేతలకు బిగ్ డే. 79 రోజుల ఉత్కంఠకు ఆరోజున తెరపడనుంది. ఐదేళ్ల ప్రభుత్వ పనితీరుకు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వనున్నారు. దేశంలోని 96.8 కోట్ల మంది ఓటర్లు నేతల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తారా? రాష్ట్ర ప్రజలు మార్పునకే ఓటేశారా? దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధిస్తారా? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందా? అన్న ప్రశ్నలకు ఆ మంగళవారమే సమాధానం లభించనుంది.

News March 16, 2024

లోక్‌సభ పోలింగ్ తర్వాత J&K ఎన్నికలు: రాజీవ్‌కుమార్

image

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై CEC రాజీవ్‌కుమార్ స్పందించారు. ‘లోక్‌సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన తెలిపారు.

News March 16, 2024

లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 1/2

image

ఎన్నికల నగారా మోగింది. బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగమైన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. సీపీఐ-3, సీపీఎం-2తో గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన లెఫ్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. ఈసారి తేడా వస్తే అది కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.

News March 16, 2024

లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 2/2

image

లెఫ్ట్ పార్టీలకు కేరళ ఒక్కటే కంచుకోటగా మిగిలింది. LDF, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని UDF రాష్ట్రంపై పట్టుబిగించాలని భావిస్తున్నాయి. 2004లో గరిష్ఠంగా CPM (43), CPI (10), రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (3), ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (3) లోక్‌సభ సీట్లు గెలిచాయి. ఆ తర్వాత పతనమవసాగాయి. పొత్తులతో సీట్ల కేటాయింపు తగ్గడం, BJP విస్తరిస్తుండటంతో లెఫ్ట్ పార్టీలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

error: Content is protected !!