India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్లోని అన్ని పాఠశాలల్లోనూ రోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో కచ్చితంగా జాతీయగీతాన్ని ఆలపించాలని అక్కడి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ఉదయం అసెంబ్లీల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక సమగ్రత, ఐకమత్యం అలవడతాయని అందులో వివరించారు. అవసరమైతే ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించి విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంచాలని సూచించారు.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేశారు. ఆ జట్టు సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్(64) హాఫ్ సెంచరీతో రాణించారు. ఓపెనర్ తంజిద్ హసన్(35), మహ్మదుల్లా(25) ఫరవాలేదనిపించారు. నెదర్లాండ్స్ గెలవాలంటే 160 రన్స్ చేయాలి. ఇందులో ఏ జట్టు గెలిస్తే దానికి సూపర్8 అవకాశాలు మెరుగవుతాయి.
బక్రీద్ వేళ గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గోవుల తరలింపును అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. అక్రమంగా గోవులను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జంతువధ చట్టం అమలులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. బక్రీద్ వేళ గోవధను అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఇలా స్పందించింది.
AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో అందరి దృష్టి మంత్రి వర్గ కూర్పుపై పడింది. ఎవరికి ఏ శాఖలు ఇస్తారనే ఉత్కంఠ నిన్నటి నుంచి కొనసాగుతోంది. బుధవారం రాత్రే శాఖలు ప్రకటిస్తారని చాలామంది భావించారు. కానీ ప్రకటించలేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితి చూస్తుంటే ఈరోజు కూడా అందరూ ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేలా కనిపించడం లేదు.
AP: టీడీపీ నేతల దాడులకు భయపడొద్దని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు. విశాఖలో కార్పొరేటర్లతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కార్పొరేషన్, స్థానిక సంస్థల్లో తమ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అన్నారు. వాటికి లొంగకుండా అందరం కలిసి సమష్టి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైకి నిన్న హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. ‘నిన్న నేను హోంమంత్రి అమిత్ షాను కలిశాను. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన నన్ను అడిగారు. రాజకీయంతో పాటు నియోజకవర్గ పనులను చూసుకోవాలని సూచించారు. నా గురించి వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్టు’ అని ట్వీట్ చేశారు.
AP: రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిందని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం ఓ విలువైన పాఠమన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేదేం లేదని అమరావతి రైతులు నిరూపించారని అన్నారు. 1631 రోజుల శాంతియుత ఉద్యమం గొప్పదని పేర్కొన్నారు. చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషకరమని అన్నారు.
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఈ ఏడాది వింబుల్డన్కు గైర్హాజరు కానున్నట్లు ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వింబుల్డన్ టోర్నమెంట్ వచ్చే నెల 1నుంచి లండన్లో ప్రారంభం కానుండగా 26నుంచి ఒలింపిక్స్ మొదలవుతాయి. కార్లోస్ అల్కరాజ్తో కలిసి నాదల్ డబుల్స్ ఆడతారని స్పెయిన్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ నంబర్లపై టెలికాం సంస్థల నుంచి ఫీజు వసూలు చేసేందుకు TRAI సిద్ధమైంది. అలాగైతే ఆ సంస్థలు తమ యూజర్లపై ఛార్జీ వేసే అవకాశం ఉంది. ఫోన్ నంబర్లు అపరిమితం కాదని, అవీ విలువైన వనరులేనని భావిస్తోన్న TRAI నంబర్లపై ఛార్జీతో పాటు వినియోగంలో లేని నంబర్లపైనా పెనాల్టీలు విధించేందుకు సిద్ధమైందని సమాచారం. డ్యుయల్ సిమ్ యూజర్లకు ఇది ఎఫెక్టవుతుంది. ఛార్జీ ఒకసారి వేయాలా? ఏడాదికోసారి వేయాలా? అనేది నిర్ణయించలేదట.
కేంద్ర బొగ్గు&గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన BJP MP కిషన్రెడ్డికి ఆ పార్టీ హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డి అన్నకు శుభాకాంక్షలు. మన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకోవడం, స్థిరమైన వృద్ధి సాధించడంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.