news

News June 11, 2024

కొత్త బీర్లు ఇప్పట్లో లేనట్లే!?

image

TG: ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కొత్త కంపెనీలు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ఆ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పర్మిషన్లకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

News June 11, 2024

ఏపీకి అర్బన్ డెవలప్‌మెంట్ ఇస్తే బాగుండేదని అభిప్రాయం!

image

NDAలో కీలకమైన టీడీపీకి ప్రాధాన్యమైన శాఖలు దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా కల్గిన విమానయాన శాఖ కేటాయించినా ఏపీకి అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. అర్బన్ డెవలప్‌మెంట్ ఇస్తే అమరావతి అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి పదవుల కన్నా కేంద్రనిధులపైనే టీడీపీ ఫోకస్ పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

News June 11, 2024

17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

image

AP: కొత్తగా ఎన్నికైన MLAలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

News June 11, 2024

లాహోర్‌లో ఆడండి.. భారత్‌కు PCB విన్నపం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా భారత్ తమ అన్ని మ్యాచ్‌లు ఆడాలని PCB కోరింది. ఈ మైదానాన్ని హోంగ్రౌండ్‌గా చేసుకుని ఆడాలని విజ్ఞప్తి చేసింది. ఆ జట్టుకు ఇక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పాక్ వినతిపై BCCI ఇంకా స్పందించనట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడాలని భారత్ భావిస్తోంది.

News June 11, 2024

చంద్రబాబు రెండో సంతకం దానిపైనే..

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం CM హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని TDP ప్రకటించింది.

News June 11, 2024

T20WC: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

image

T20WCలో అత్యల్ప స్కోరు(114)ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. నిన్న బంగ్లాపై గెలుపుతో ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక-120(vsకివీస్), ఇండియా-120(vsపాక్), అఫ్గాన్-124(vsవిండీస్), న్యూజిలాండ్-127(vs ఇండియా) ఉన్నాయి. అలాగే పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాపై వరుసగా అత్యధిక మ్యాచ్‌లు(9) గెలిచిన రెండో జట్టుగా ప్రొటీస్ నిలిచింది. కివీస్ 10 గెలుపులతో తొలిస్థానంలో ఉంది.

News June 11, 2024

చంద్రబాబును CM అభ్యర్థిగా ప్రతిపాదించనున్న పవన్!

image

AP: కాసేపట్లో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమికి ఆయన ఆహ్వానం పంపనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

News June 11, 2024

విద్యార్థులకు GOOD NEWS: యథావిధిగా విద్యాకానుక కిట్లు

image

AP: ప్రభుత్వం మారడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లతో కూడిన కిట్స్ సంగతేంటనే ప్రశ్న తలెత్తింది. అయితే వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యాకానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News June 11, 2024

క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్

image

సిక్కులపై అనుచిత <<13417892>>వ్యాఖ్యలు<<>> చేసినందుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ క్షమాపణలు చెప్పారు. ‘నా కామెంట్స్ పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్‌తో పాటు సిక్కులందరినీ క్షమాపణ కోరుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 11, 2024

విమానాశ్రయాల ప్రాజెక్టులకు రెక్కలు!

image

AP: TDP MP రామ్మోహన్ నాయడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ సమీకృత టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. విశాఖ సమీపంలోని భోగాపురం, నెల్లూరు(D) దగదర్తిలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని గతంలో చంద్రబాబు నిర్ణయించినా అధికారం కోల్పోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు వాటి ఏర్పాటుకు అవకాశం లభించింది.