India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 WC తర్వాత 8 నెలలకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 FEB 19-MAR9 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం లాహోర్ వేదికగా INDvsPAK మ్యాచ్ జరగనున్నట్లు CRICBUZZ పేర్కొంది. అయితే దీనికి భారత ప్రభుత్వం, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. ఒకవేళ పాక్లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
వర్చువల్ <<13412919>>అటాప్సీ<<>> విధానం 80-90% అసహజ మరణ కేసులకు అనుకూలమని డాక్టర్లు తెలిపారు. విషప్రయోగం లాంటి కొన్ని కేసుల్లో మృతికి గల కారణాలు తేల్చాలంటే మృతదేహాల పొట్టభాగంలో కత్తిగాట్లు తప్పనిసరి అని చెబుతున్నారు. మూత్రం, మలం, ఫ్లూయిడ్ టెస్టులు చేయాల్సిన కేసుల్లోనూ కత్తిగాట్లు తప్పవని అంటున్నారు. వర్చువల్ అటాప్సీకి 30min మాత్రమే పడుతుందని, ప్రస్తుతం చేస్తున్న పోస్టుమార్టం 3-4hrలో పూర్తవుతుందని వివరించారు.
కత్తిగాటు లేకుండా వర్చువల్ అటాప్సీ విధానంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసే టెక్నాలజీ త్వరలో ఏపీలో రానుంది. ఈ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. సీటీ, ఎమ్మారై, 3D ఫొటోగ్రామ్మెట్రీ టెక్నాలజీ ఉన్న యంత్రంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. మృతదేహాన్ని బ్యాగుల్లో ఉంచి యంత్రంలోకి పంపిస్తే అన్ని కోణాల్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. వాటిని బట్టి మృతికి గల కారణాలను నిర్ధారిస్తారు.
నిన్న తొలి ఇన్నింగ్స్లో INDను 119 రన్స్కే PAK కట్టడి చేయడంతో ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. ‘పాక్ టీమ్ గ్రేట్ బౌలింగ్. టోర్నీలో ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. ఛేజింగ్కు దిగే అబ్బాయిలకు ఆల్ ది బెస్ట్’ అని రాసుకొచ్చారు. అయితే పాక్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆయన మళ్లీ ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో ‘గుర్తుపెట్టుకోండి.. ఎప్పుడూ ముందే సంబరాలు చేసుకోవద్దు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
భారత ఫుట్బాల్ జట్టు <<13411799>>కెప్టెన్గా<<>> నియమితులైన గుర్ప్రీత్సింగ్ మొహాలీలో జన్మించారు. 9వ ఏటనే ఫుట్బాల్ ఆడటం మొదలెట్టారు. చండీగఢ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు IND తరఫున 72 మ్యాచులు ఆడారు. IND U19, IND U13 జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. UEFA యూరోప్ లీగ్లో ఆడిన తొలి భారత ప్లేయర్గా, ఐరోపాలో ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడిన ఐదో IND ఆటగాడిగా నిలిచారు. ISLలో బెంగళూరు టీమ్కు ఆడుతున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించారు.
ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర వర్గాల సమాచారం. ఈ మీటింగ్లో పీఎం ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) కింద 2 కోట్ల ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. PMAY-G లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని మరో 50% పెంచొచ్చని పేర్కొన్నాయి. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.
జమ్మూకశ్మీర్ రియాసిలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ALL EYES ON REASI’ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘ALL EYES ON RAFAH’ అని పోస్టులు పెట్టిన సినీ సెలబ్రిటీలకు రియాసి ఉగ్రదాడి కనిపించడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
IPL ఆడకపోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అన్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్లో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘IPL సమయంలో అలసటతో ఉన్నా. చిన్నచిన్న గాయాలు కూడా వేధించాయి. టోర్నీలో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నా. WC వరకు ఫిట్నెస్ సాధించా’ అని జంపా వివరించారు. ప్రస్తుతం అతడు RR టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.