news

News June 8, 2024

రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి

image

మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, చంద్రబోస్ నివాళులర్పించారు. ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగిందని చిరంజీవి ట్వీట్ చేశారు.

News June 8, 2024

తన పేరు తానే పెట్టుకున్న రామోజీ

image

మీడియా టైకూన్ రామోజీరావు అసలు పేరు అది కాదు. తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ ఆయనకు ‘రామయ్య’ అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేంతలా ఆయన ఎదిగిపోయారు.

News June 8, 2024

రామోజీరావు నిర్మించిన సినిమాలు

image

శ్రీవారికి ప్రేమలేఖ(1984), మయూరి(1985), మౌన పోరాటం(1989), ప్రతిఘటన(1987), పీపుల్స్ ఎన్‌కౌంటర్(1991), అశ్వని(1991), మెకానిక్ మామయ్య(1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ఆనందం (2001), ఆకాశ వీధిలో(2001), నిన్ను చూడాలని(2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), నచ్చావులే(2008), నిన్ను కలిశాక(2009), దాగుడుమూత దండాకోర్(2015) వంటి 87 సినిమాలను రామోజీరావు నిర్మించారు.

News June 8, 2024

బాలీవుడ్‌పై కంగన ఫైర్.. పోస్ట్ డిలీట్

image

తనపై CISF కానిస్టేబుల్ దాడి చేయడంపై బాలీవుడ్ స్పందించకపోవడాన్ని నటి, MP కంగన తప్పుబట్టారు. ‘నాపై ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మన దేశంలో లేదా విదేశాల్లో నడుచుకుంటూ వెళుతుంటే ఇజ్రాయెల్/పాలస్తీనా వారు మీపై, మీ పిల్లలపై దాడి చేయొచ్చు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వెంటనే దాన్ని డిలీట్ చేశారు.

News June 8, 2024

రామోజీరావు.. మీడియా మొఘల్

image

<<13400528>>రామోజీరావు<<>> 1974 AUG 10న నక్కవానిపాలెం(విశాఖ)లో ‘ఈనాడు’ తొలి ఆఫీస్‌ను ప్రారంభించారు. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. 1995లో ETV ఛానల్‌ను ప్రారంభించి ‘ఈటీవీ.. మీటీవీ’ స్లోగన్‌తో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు. 2003లో ETV-2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్తా ఛానల్‌ను తీసుకొచ్చారు. దీన్ని 2014లో ETV AP, TGగా మార్చారు.

News June 8, 2024

రామోజీని వరించిన పురస్కారాలు

image

ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీని నిర్మించిన మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు సేవలకు ఎన్నో పురస్కారాలు/ డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం & శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం & శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, యుధ్వీర్ అవార్దు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి (రాజస్థాన్) అవార్డు, బి. డి. గోయెంకా అవార్డు, 2016లో సాహిత్యం, విద్య విభాగాలలో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.

News June 8, 2024

శ్రీశ్రీ కుమారుడు కన్నుమూత

image

మహాకవి శ్రీరంగం శ్రీనివాసురావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికా కనెటికట్ రాష్ట్రంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగానే ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వెంకట రమణ మృతి పట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకట రమణ, ఫైజర్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.

News June 8, 2024

రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఏర్పాట్లు పూర్తి

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రేపు ఉ.10.30 నుంచి 1 వరకు జరగనుంది. దీనికి TGPSC అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 897 కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

News June 8, 2024

పెదపారుపూడి ‘పద్మవిభూషణ్’

image

రామోజీరావు కృష్ణా(D) పెదపారుపూడిలో 1936 NOV 16న రైతు కుటుంబంలో జన్మించారు. BSc చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని వివాహమాడారు. 1962లో ‘మార్గదర్శి’ని ప్రారంభించారు. అదే ఆయన తొలి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ‘ఈనాడు’ను స్థాపించారు. ఫిల్మ్‌సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

News June 8, 2024

రామోజీరావు కన్నుమూత

image

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.