India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయ నగరం, విశాఖలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP: ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామన్నారు. భారతీయులు లక్ష్యంగా ఏపీవాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు.
రాజమౌళి డైరెక్షన్లో మహేశ్ బాబు నటించబోయే మూవీ షూటింగ్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.100 కోట్లతో భారీ సెట్ వేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది.
మోదీ, షా స్టాక్ మార్కెట్ల స్కాంకు పాల్పడ్డారన్న రాహుల్ <<13392703>>వ్యాఖ్యల<<>>కు బీజేపీ ఎంపీ పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భయంతో స్టాక్ మార్కెట్ పడిపోయిందని అన్నారు. తిరిగి మోదీ ప్రభుత్వమే రావడంతో కుదురుకుంటోందని చెప్పారు. మరోవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మహిళకు రూ.లక్ష ఇస్తామనే హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్(CRP) ద్వారా నియామకాలు చేపట్టనుంది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రిలిమ్స్ ఆగస్టు/సెప్టెంబర్లో నిర్వహించనుంది. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది వెల్లడించలేదు. మరిన్ని వివరాలకు <
కాంగ్రెస్తో పొత్తు లోక్సభ ఎన్నికలకే పరిమితమని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలోని 7 సీట్లనూ కోల్పోవడంపై స్పందిస్తూ.. ‘మా టాప్ లీడర్లు జైలులో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ నేతల మెజార్టీని భారీగా తగ్గించాం’ అని పేర్కొన్నారు.
తెలుగు ప్లేయర్ హనుమ విహారి మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్ర క్రికెట్ సంఘం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందిన అతడు ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో జరిపిన చర్చలు ఫలించినట్లు సమాచారం. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి తనను అర్ధంతరంగా తప్పించడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన విహారి.. ఆంధ్రకు మళ్లీ ఆడబోనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
TG: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ ఫేజ్-1లో 76,290 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. అత్యధికంగా కామర్స్ గ్రూపుల్లో 28,655, లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 15,301, ఫిజికల్ సైన్సెస్ గ్రూపుల్లో 14,964, ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766, డేటా సైన్స్ గ్రూపుల్లో 2,502, డీఫార్మసీ గ్రూపుల్లో 90, ఇతర గ్రూపుల్లో 7,012 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఈ నెల 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.
AP: కాబోయే సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. CMOలో మరి కొందరు అధికారుల నియామకంపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పేషీల్లోని పీఎస్లు, OSDలు ఈ నెల 11లోగా మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. కాగా ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులను <<13392587>>తొలగించిన<<>> విషయం తెలిసిందే.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా గుంటూరు, విజయవాడలో పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజా సేవకులుగా మారాలని సూచించారు. కాగా రేపు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల ఎంపీల భేటీలో ఆయన పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.