news

News June 6, 2024

పవన్ కళ్యాణ్ కేబినెట్‌లో చేరుతారా?

image

AP ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ <<13386375>>మంత్రిగా<<>> ఉంటారా? లేదా? అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. జనసేన MLAలకే మంత్రులుగా అవకాశం ఇచ్చి తాను ఇతర బాధ్యతలు తీసుకుంటారని చర్చ నడుస్తోంది. ఇక JSP నుంచి నాదెండ్ల మనోహర్‌తో పాటు SC, ST, BC వర్గాలకు చెందిన మరికొందరికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. అటు BJP నుంచి ఇద్దరికి (సత్యకుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్) కేబినెట్ బెర్త్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది.

News June 6, 2024

నటి హేమను విచారిస్తున్న బెంగళూరు పోలీసులు

image

AP: రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమను బెంగళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగాలతో ఆమెను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం ఆనేకల్ కోర్టులో హాజరుపర్చారు. ఆమెను ఒక రోజు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. ఇవాళ సాయంత్రం ఆమెను తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.

News June 6, 2024

డ్రింక్స్ బాయ్‌గా మారిన పాట్ కమిన్స్!

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతోన్న Australia VS Oman మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ డ్రింక్స్ బాయ్‌గా కనిపించారు. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా తమ ప్లేయర్లకు డ్రింక్స్ అందించేందుకు ఆయన స్టేడియంలో పరిగెత్తారు. ఈ ఫొటోను SRH ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ODI వరల్డ్ కప్ ఛాంపియన్, WTC విజేత, అత్యంత విజయవంతమైన కెప్టెన్ కమిన్స్ ఆటగాళ్లకు పానీయాలు అందించారని అభినందిస్తున్నారు.

News June 6, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్?

image

AP: ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాయపూడిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 50 లారీల్లో సామాగ్రి సిద్ధం చేశారు. అటు ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఉండవల్లిలోని CBN ఇంటివద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News June 6, 2024

అవసరమా.. ఇలాంటి సవాళ్లు

image

నేతల మాటలు, సవాళ్లు కొన్నిసార్లు శృతి మించి వారినే ముంచేస్తున్నాయి. అప్పట్లో తెలంగాణ వస్తే రాజకీయాలు వీడుతానన్న లగడపాటి అలా చేశారు. తాజాగా పవన్ గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ ఈ మార్పుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో BRS విషయంలో నారాయణ చెవి కోసుకుంటానని, మునుగోడులో ఓడితే మళ్లీ పోటీ చేయనని కోమటిరెడ్డి శపథాలు చేశారు. ప్రజలకు పనులు, ఫలితాలు కావాలి తప్ప ఈ పర్సనల్ సవాళ్లు కాదు.

News June 6, 2024

లోక్‌సభకు 280 మంది కొత్తవారు

image

ఈసారి లోక్‌సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి MPలుగా గెలిచారు. UP నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు. కొత్తగా లోక్‌సభలో అడుగుపెట్టే వారిలో మాజీ CMలు శివరాజ్‌సింగ్‌, బొమ్మై, మనోహర్ లాల్ వంటి వారితోపాటు సినీనటులు కంగనా, సురేశ్ గోపి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో TG నుంచి 10, AP నుంచి 13 మంది కొత్తవారున్నారు.

News June 6, 2024

టీడీపీ TO బీజేపీ.. ఐదేళ్లు గ్యాప్.. మళ్లీ పవర్

image

గత TDP ప్రభుత్వ హయాంలో MPలుగా సుజనా చౌదరి, సీఎం రమేశ్ కీలకంగా వ్యవహరించారు. పార్టీకి ఆర్థికంగా దన్నుగా ఉండటంతో పాటు పార్లమెంట్‌లోనూ TDP గళాన్ని గట్టిగా వినిపించారు. 2019 ఎన్నికల నాటికి NDA నుంచి TDP బయటకొచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ BJPలో చేరారు. మళ్లీ ఇప్పుడు APలో BJP నుంచి ఈ నేతలు కీలకంగా మారారు. సీఎం రమేశ్ MP, సుజనా చౌదరి MLA టిక్కెట్లు దక్కించుకుని గెలిచారు.

News June 6, 2024

TDP తొలిసారి గెలిచిన 6 స్థానాలు

image

డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి బోణీ కొట్టింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది.
> డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ.

News June 6, 2024

పార్టీలు చీల్చిన వారికి ఓటర్ల షాక్!

image

మహారాష్ట్రలో పార్టీలను చీల్చిన వారికి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. తన బాబాయి శరద్ పవార్ నుంచి NCPని దక్కించుకున్న అజిత్ పవార్‌ పార్టీ 4చోట్ల పోటీ చేస్తే ఒకచోట మాత్రమే నెగ్గింది. అటు శరద్ పవార్ సారథ్యంలోని NCP 10 చోట్ల పోటీ చేయగా 8 గెలిచింది. మరోవైపు శివసేన విషయంలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ శిండే వర్గం 7చోట్ల గెలిస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9MP సీట్లు గెలుచుకుంది.

News June 6, 2024

ఓటమితో సిగ్గుపడాల్సిన పని లేదు: నవీన్

image

ఒడిశాలో అధికారం కోల్పోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మాజీ CM నవీన్ పట్నాయక్ అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ MLAలతో ఆయన మాట్లాడారు. తాను తొలిసారి CM అయినప్పుడు రాష్ట్రంలో 70% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారని, దాన్ని 10శాతానికి తగ్గించానని గుర్తుచేశారు. 24ఏళ్లుగా రాష్ట్రానికి BJD సేవలందించిందని, ఇంకా పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో BJPకి 78, BJDకి 51 సీట్లు వచ్చాయి.