news

News March 16, 2024

దాతృత్వానికి దక్కిన గౌరవం!

image

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. ముంబైలో జరిగిన వేడుకలో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు. దాతృత్వంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు దక్కింది. తన ఆదాయంలో సగానికి పైగా విరాళం ఇచ్చిన ఆయన.. ట్రస్టు ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

News March 16, 2024

ధోనీ, కోహ్లీ ఫాలోయింగ్‌పై బట్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

కెప్టెన్ కూల్ MS ధోనీ, కింగ్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీఎల్‌లో ధోనీ, కోహ్లీ మైదానంలో నడిస్తే చాలు ఫ్యాన్స్ అంతా టైలర్ స్విఫ్ట్ కన్సర్ట్‌లో పదేళ్ల పిల్లల్లా మారిపోతారు. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ నమ్మశక్యం కానిది. వారు కేవలం మైదానంలోకి వస్తే చాలు ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేస్తారు’ అని చెప్పుకొచ్చారు.

News March 16, 2024

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు: రాజీవ్ కుమార్

image

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జూన్ 16లోపు ఈ పక్రియ పూర్తి చేస్తామన్నారు.

News March 16, 2024

నాలుగోసారి మామాఅల్లుళ్ల పోటీ

image

AP: శ్రీకాకుళం(D) ఆమదాలవలసలో మరోసారి మామాఅల్లుళ్ల పోటీ జరగనుంది. కూన రవికుమార్‌(TDP)కి స్పీకర్ తమ్మినేని సీతారాం(YCP) స్వయాన మేనమామ. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధంతో స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికే 3సార్లు వీరు ఎన్నికల్లో తలపడగా మరోసారి పోటీకి సై అంటున్నారు. 2014లో TDP తరఫున రవి, 2019లో సీతారాం YCP నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.

News March 16, 2024

చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు విశాఖ జిల్లాలోనే టికెట్ కేటాయించాలని గంటా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

News March 16, 2024

పోటీలో తండ్రీకొడుకులు

image

వైసీపీ అభ్యర్థుల్లో రెండు కుటుంబాల తండ్రీకొడుకులకు టికెట్లు దక్కాయి. పుంగనూరు ఎమ్మెల్యేగా కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక ఇదే తరహాలో ఈయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా తిరిగి బరిలో నిలుస్తారని పార్టీ ప్రకటించింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు MP స్థానం, ఆయన కొడుకు మోహిత్- చంద్రగిరి MLA టికెట్లు పొందారు.

News March 16, 2024

రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలిలా..

image

రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో YCP 22 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ 3 సీట్లకే పరిమితమైంది.
* మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 సీటు గెలిచాయి. 2014తో పోల్చితే వైసీపీకి 84సీట్లు పెరిగాయి. టీడీపీ 49 సీట్లు కోల్పోయింది.

News March 16, 2024

స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 1/2

image

కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. అయితే ఓ 25 సంస్థలు తమ స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీటి విలువ రూ.5 కోట్లలోపే అయినా ఏకంగా రూ.250కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. వీటిలో తొమ్మిది కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వచ్చాక (2018) ఏర్పడటం గమనార్హం. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలూ ఉన్నాయి.

News March 16, 2024

స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 2/2

image

లాభాల్లో గరిష్ఠంగా 7.5శాతాన్నే డొనేట్ చేయాలనే నిబంధన పోవడంతో టర్నోవర్‌తో సంబంధం లేకుండా కంపెనీలు విరాళాలు ఇస్తున్నాయి. 2023లో టీషార్క్స్ ఇన్‌ఫ్రా, టీషార్క్స్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చెరో రూ.లక్షతో ఏర్పడిన కొన్ని నెలలకే రూ.7.5కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. అపర్నా ఫార్మ్స్ రూ.5లక్షలతో ఏర్పడగా రూ.30కోట్లు విలువైన బాండ్స్ కొంది. ఇలా సంస్థలు స్థోమతకు మించి బాండ్స్ కొనడం చర్చనీయాంశమైంది.

News March 16, 2024

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు?

image

AP: 25 MP స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన YCP.. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తిగా లేదు. దీంతో ఇక్కడ ఎవర్ని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీ తరఫున సీఎం రమేశ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుండగా.. BCల్లో బలమైన అభ్యర్థికై YCP అన్వేషిస్తోంది.

error: Content is protected !!