India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1984 నుంచి 2023 వరకు 14 సార్లు వన్డే, రెండు సార్లు టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియాకప్లో అత్యధిక సార్లు టీమ్ ఇండియా(8) విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజయం సాధించాయి. ఈ సారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లోనే ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్లో జరగగా రోహిత్ సారథ్యంలో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.
USలో గన్ కల్చర్ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. హరియాణాకు చెందిన కపిల్ (26) రూ.45 లక్షలు ఖర్చు పెట్టి 2022లో డంకీ రూట్ ద్వారా USకు వెళ్లాడు. అక్కడ అరెస్టై లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా బయటకు వచ్చి కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదం చెలరేగింది. అతడు కాల్పులు జరపడంతో కపిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలాడు.
TG: ఎరువుల సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఫైరయ్యారు. తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమని తెలిపారు.
టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్లో జరగనున్న ఆసియా కప్కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.
ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆధార్ కార్డు జెన్యూన్గా ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. దీనిని 12వ డాక్యుమెంట్గా పరిగణించాలని పేర్కొంది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.
ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <
మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి <<17646725>>నవ్య నాయర్<<>>కు ఆస్ట్రేలియా ఎయిర్పోర్టు అధికారులు ఫైన్ విధించారు. అక్కడికి పువ్వులు, పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ముడి గింజలు, పాల ఉత్పత్తులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, రసగుల్లా, మైసూర్ పాక్, గులాబ్ జామూన్, రస్ మలై, బియ్యం, టీ, తేనె, హోమ్ ఫుడ్, పెట్స్ ఫుడ్, పక్షులు, పక్షుల ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, మేపుల్ సిరప్ తీసుకెళ్తే రూ.1,54,316 వరకు ఫైన్ విధిస్తారు.
AP: కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(NEP)లో హిందీ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. తానూ 3 భాషలు నేర్చుకున్నట్లు ఇండియా టుడే సదస్సులో చెప్పారు. చదువుపై రాజకీయాల ప్రభావం పడకూడదని అభిప్రాయపడ్డారు. నేటి తరం పిల్లలు ఐదేసి భాషలు నేర్చుకుంటున్నారని, ఎక్కువ భాషలతో విదేశాల్లో పనిచేసేందుకు వీలుంటుందన్నారు.
TG: అంగన్వాడీలకు పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించిన ఆమెకు గతనెల 58% మాత్రమే పాలు సరఫరా అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి రిపీట్ కావొద్దని, పాలతో పాటు గుడ్లు, పప్పు, ఇతర ఆహార పదార్థాలు సక్రమంగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రతి 10 రోజులకోసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని, లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పంట పొలాల్లో అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే మొక్క పార్థీనియం(వయ్యారిభామ). ఇది వాతావరణ అనుకూల పరిస్థితుల్లో 4 వారాల్లో పుష్పించి దాదాపు 10K-50K వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గాలి ద్వారా 3KM దూరం వరకు విస్తరించి మొలకెత్తుతాయి. భూమి నుంచి నత్రజనిని వేర్ల ద్వారా గ్రహించే శక్తి ఇతర మొక్కలతో పోలిస్తే వయ్యారిభామకు 10 రెట్లు ఎక్కువ. ఇది మొలిచిన చోట్ల పైరుల ఎదుగుదల ఆగిపోతుంది.
Sorry, no posts matched your criteria.