India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులొచ్చాయనో విద్యార్థులు సూసైడ్ చేసుకొని జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఈ సమయంలో ఫెయిలైన పిల్లల తల్లిదండ్రులు వారిని దగ్గరికి తీసుకొని, ఫెయిల్ అయినంత మాత్రాన అంతా అయిపోదనే భరోసా కల్పించండి. తక్కువ మార్కులొస్తే మరొకరితో పోల్చి సూటిపోటి మాటలు అని చిన్ని హృదయాలకు భారం అవ్వొద్దు. ఈ వయసులో వారు తట్టుకోలేక కఠిన నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.
TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.
AP: ఇద్దరు టెన్త్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కృష్ణా(D) అర్జువానిగూడెంకు చెందిన G.అనిల్ గతేడాది, ప్రస్తుతం సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయాడు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన G.వేణుగోపాలరావుకు ఇవాళ టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని ఉరేసుకొని మృతిచెందగా, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో మెరిశారు. పల్నాడు(D) ఒప్పిచర్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు తెచ్చుకుంది. హిందీ, ఇంగ్లిష్లో 99 మార్కుల చొప్పున వచ్చాయి. అన్నమయ్య(D) పెద్దవీడు, ప్రకాశం (D) అలకూరపాడు ZP స్కూల్స్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమాలో ఉన్ని ముకుందన్ నటించే అవకాశాలున్నాయి. ఓ కీలక పాత్ర కోసం డైరెక్టర్ ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ పోలీసుగా కనిపించనున్నారు. మలయాళ నటుడైన ముకుందన్ ఇటీవల ‘మార్కో’ సినిమాతో హిట్ అందుకున్నారు.
TG: తెలంగాణలో పదో తరగతి ఫలితాలపై అప్డేట్ వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ఎస్సెస్సీ బోర్డు ఎదురుచూస్తోంది. అందులో మార్కులు ఎలా ముద్రించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.
TG: గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని బాధతో రిజల్ట్స్ రాకముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతనికి నిన్న వచ్చిన ఫలితాలలో 391 మార్కులు వచ్చాయి. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల్లో విఫలమయ్యామని మనస్తాపంతో ఐదుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
TG: గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని బాధతో రిజల్ట్స్ రాకముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతనికి నిన్న వచ్చిన ఫలితాలలో 391 మార్కులు వచ్చాయి. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల్లో విఫలమయ్యామని మనస్తాపంతో ఐదుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.