news

News March 19, 2024

జాగ్రత్త.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా?

image

ప్రస్తుతం బరువు తగ్గేందుకు చాలా మంది ఫాలో అవుతున్న ట్రెండ్.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఈ పద్ధతిని ఎక్కువ కాలం అనుసరిస్తే అనారోగ్యం పాలవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎనిమిదేళ్ల వ్యవధిలో గుండె జబ్బుల ముప్పు 91శాతం పెరుగుతుందని తెలిపారు. కాబట్టి ఈ పద్ధతిని తక్కువ కాలానికి పరిమితం చేయాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు మూడు నెలల వరకు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే లాభాలు ఉంటాయని స్పష్టం చేశారు.

News March 19, 2024

శరద్ పవార్ వర్గానికి సుప్రీం కీలక ఆదేశాలు

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్’ అనే పార్టీ పేరును, ‘బాకా ఊదుతోన్న వ్యక్తి’ గుర్తును ఉపయోగించేందుకు అనుమతించింది. వీటిని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లను ఆదేశించింది. ఈ పేరు, గుర్తును ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వాడొద్దని సూచించింది.

News March 19, 2024

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

image

AP: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్‌లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్‌లెట్ ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

News March 19, 2024

చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా: సురభి

image

త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు హీరోయిన్ సురభి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. అందరం సీట్లలో నుంచి కిందపడిపోయాం. నా గుండె జారిపోయినంత పనైంది. కానీ కొన్ని గంటల తర్వాత పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. నాకైతే చావు అంచులదాక వెళ్లొచ్చినట్లు అనిపించింది’ అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించారు.

News March 19, 2024

ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

News March 19, 2024

జనసేన లేకపోతే పొత్తులు లేవు: పవన్

image

AP: పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన లేకపోతే పొత్తులే లేవన్నారు. అందుకోసం బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించినట్లు చెప్పారు. మరోవైపు వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని పవన్ కోరారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిస్తే దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తానని పవన్ అన్నారు.

News March 19, 2024

CA పరీక్ష తేదీల మార్పు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. CA ఇంటర్ కోర్సు గ్రూప్-1 పరీక్షలు మే 3, 5, 9న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 11, 15, 17న నిర్వహించనున్నట్లు ICAI ప్రకటించింది. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో గ్రూప్-1 పరీక్షలు మే 2, 4, 8న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 10, 14, 16న నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలను www.icai.org వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

News March 19, 2024

లక్ష మెజార్టీతో గెలుస్తా: పవన్

image

AP: తనను పిఠాపురంలో పోటీ చేయాలని ఎక్కువ మంది కోరడంతోనే బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘నన్ను అసెంబ్లీ పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధీమాతోనే చెబుతున్నా.. లక్ష మెజార్టీతో గెలుస్తా. ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదు. అలాంటిది నన్ను ఓడించడానికి ఓటుకు రూ.10వేలు, కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

News March 19, 2024

ఎన్నికల్లో తగ్గేదేలే అంటున్న ‘సూపర్ సీనియర్లు’!

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్లతో పాటు ‘సూపర్ సీనియర్లు’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరు 1952లో దేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక్క యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోనే 1049 మంది ఈ ‘సూపర్ సీనియర్’ ఓటర్లు ఉన్నారట. వీరి వయసు 100-120ఏళ్ల మధ్య ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో 414 మంది ఓటర్లు పురుషులు కాగా 440 మంది మహిళలు ఉండటం విశేషం.

News March 19, 2024

వేసవిలో.. చల్లని విహారం

image

వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్తారు. ఇండియాలో సమ్మర్ వెకేషన్ ప్రాంతాలు చాలానే ఉన్నా.. ఊటీ, కొడైకెనాల్, గ్యాంగ్‌టక్, కశ్మీర్, చిరపుంజి, సిమ్లా పర్యాటక ప్రదేశాలు చాలా ఫేమస్. అక్కడి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఆయా ప్రదేశాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.

error: Content is protected !!