India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గి రూ.90,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.
US వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారత పర్యటనలో ఉండగా జరిగిన ఉగ్రదాడి తరహాలోనే.. పాతికేళ్ల క్రితం అప్పటి US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పర్యటన సమయంలోనూ ఓ అటాక్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రమూక భారత ఆర్మీ దుస్తులు ధరించి అనంతనాగ్లోని చిట్టిసింగ్పురాకు వెళ్లారు. పురుషులను గురుద్వారా ముందు లైన్లో నిల్చోబెట్టి కిరాతకంగా కాల్పులు జరిపారు. ఆ ఊచకోతలో 35 మంది సిక్కులు తమ ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్కు ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని పాకిస్థాన్ ప్రోత్సహించదని, తమ దేశాన్ని అనవసరంగా నిందించకూడదని అన్నారు. భారత్ మాత్రం బలూచిస్థాన్ వ్యవహారాల్లో తల దూరుస్తోందని ఆరోపించారు. ఇండియాలో ప్రస్తుతం జరిగిన అశాంతికి ఆ దేశంలో జరుగుతున్న తిరుగుబాట్లే కారణమన్నారు. ఇస్లామిక్తో పాటు ఇతర అంశాలలో నిరసనలు పెరుగుతున్నాయన్నారు.
AP: టెన్త్ ఫలితాల్లో 1,680 స్కూళ్లలో 100% పాస్ రేట్ ఉండగా, 19 స్కూళ్ల(ఇందులో 9 ప్రైవేట్)లోని విద్యార్థులంతా ఫెయిలయ్యారు. ఓవరాల్గా 65.36% మంది ఫస్ట్, 10.69% మంది సెకండ్, 5.09% మంది థర్డ్ డివిజిన్లో పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు హవా కొనసాగించారు. 3,01,202 మంది గర్ల్స్ పరీక్షలు రాయగా 2,53,278 మంది(84.09%) పాసయ్యారు. 3,13,257 మంది బాలురు ఎగ్జామ్స్ రాయగా 2,45,307 మంది(78.31%) ఉత్తీర్ణత సాధించారు.
AP: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. https://www.bse.ap.gov.in/ సైట్లో HM లాగిన్ ద్వారా ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. లేటు ఫీజు రూ.50తో మే 19 వరకు అప్లై చేయవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచి మే 1 వరకు అవకాశమిచ్చారు. రీకౌంటింగ్కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 చెల్లించాలి.
AP: జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేయాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు.
AP: పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది పాసైనట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా (93.90%) తొలి స్థానంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా (47.64%) చివరిస్థానంలో నిలిచాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు అత్యధిక ఉత్తీర్ణత శాతం (95.02%) సాధించాయి.
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT
J&K పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన సాజిద్ను సైఫుల్లా కసూరీగానూ పిలుస్తారు. NIA ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్స్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ISI, ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.