news

News September 8, 2025

విటమిన్ల కోసం ఇవి తినండి!

image

విటమిన్ A- క్యారెట్లు, కాలేయం. B1 – తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2 – పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశనగ. B5 – అవకాడో, గుడ్లు. B6 – అరటిపండు, సాల్మన్ చేప, ఆలుగడ్డలు. B7 – గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B9 – ఆకుకూరలు, పప్పులు, సిట్రస్. B12 – చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. విటమిన్ D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్. E – పొద్దుతిరుగుడు గింజలు, బాదం. C – నారింజ, జామ. SHARE IT

News September 8, 2025

బదిలీలపై చివరి దశకు కసరత్తు!

image

AP: ఆల్ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నిన్న CS, DGP, CMO అధికారులతో CM చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. JCల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు.. SPల నుంచి DIG, IGల వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశముందని చెబుతున్నాయి. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం CM కసరత్తు చేస్తున్నారని పేర్కొంటున్నాయి.

News September 8, 2025

CM రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

TG: CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘BJP అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది’ అని గతేడాది మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై TG BJP వేసిన పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని CJI గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ పిటిషన్‌ను గతంలో HC కొట్టేయగా BJP నేత కాసం వెంకటేశ్వర్లు SCలో సవాల్ చేశారు.

News September 8, 2025

ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు

image

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

News September 8, 2025

మహాలయ పక్షాలు అంటే ఏంటి?

image

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.

News September 8, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).

News September 8, 2025

శివుడు రాక్షసులకు ఎందుకు వరాలు ఇచ్చాడంటే?

image

శివుడు ఆశుతోషుడు. త్వరగా సంతోషించిపోతాడు. ఆయనకు భక్తి, నిష్ఠ, కఠిన తపస్సు అంటే ఎంతో ఇష్టం. అందుకే.. ఎవరైనా నిస్వార్థ భక్తితో, తీవ్ర తపస్సుతో ఆరాధిస్తే వెంటనే కరిగిపోతాడు. వరం ఇస్తాడు. ఓ వ్యక్తి అకుంఠిత దీక్షకు ఆయన కట్టుబడి ఉంటాడు. రాక్షసులైనా కఠోర తపస్సు చేస్తే వారి శక్తిని గౌరవిస్తాడు. అందువల్లే రావణుడు వంటి రాక్షసులకు వరాలు ఇచ్చాడు. వీటిని ఎలా వాడుకోవాలన్నది మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తాడు.

News September 8, 2025

తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం(సిరిసిల్ల జిల్లా), కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం(సిద్దిపేట), రామప్ప రామలింగేశ్వరస్వామి గుడి(ములుగు), కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం(JS భూపాలపల్లి), రుద్రేశ్వర ఆలయం-వేయి స్తంభాల గుడి(హన్మకొండ), పానగల్ ఛాయా సోమేశ్వరాలయం(నల్గొండ), కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం(మేడ్చల్-మల్కాజిగిరి), ఐనవోలు మల్లన్న స్వామి ఆలయం(వరంగల్), జడల రామలింగేశ్వరస్వామి ఆలయం(నల్గొండ).

News September 8, 2025

దేవుని ముందు అగరబత్తీలను ఎందుకు వెలిగించాలి?

image

పురాణాల ప్రకారం.. దేవతలు ధూపాన్ని ప్రీతితో స్వీకరిస్తారు. అందువల్లే, భక్తులు పూజా సమయంలో వీటిని సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘ధూపం వేయడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. గృహంలో వ్యాపించిన ప్రతికూల శక్తులు నశించి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా.. వీటి సువాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేసి, సూక్ష్మజీవ నాశకంగా పనిచేస్తుంది’ అని పండితులు చెబుతున్నారు.

News September 8, 2025

వివిధ సంస్థల్లో 45 ఉద్యోగాలు

image

* ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్, సెక్రటరీ స్థాయిలో 19 ఖాళీలు.
వెబ్‌సైట్:https://engineersindia.com/
* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(CIPET)లో 11 ఫ్యాకల్టీ పోస్టులు. https://www.cipet.gov.in/
* ముంబై పోర్టు అథారిటీలో 15 మేనేజిరియల్ ఖాళీలు. https://mumbaiport.gov.in/
* ఖాళీలకు పోస్టును బట్టి /బీటెక్/Bsc, ఎంటెక్/Phd, PG, డిప్లొమా చేసిన వారు అర్హులు.