India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.

TG: ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ఇవాళ రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TGPSC ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్కు సంబంధించి వెరిఫికేషన్ నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఒకవేళ ఇవాళ వెరిఫికేషన్కు గైర్హాజరైనా, సర్టిఫికెట్లు పెండింగ్ ఉన్నా ఈ నెల 29న రీ-వెరిఫై చేస్తారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ఆమె నేడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా సోదరుడు రాహుల్ లోక్సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వయనాడ్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రియాంక చరిత్ర సృష్టించారు.

చాలా మంది బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేస్తుంటారు. వెంటనే తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నోటిలోని Ph స్థాయి ఆల్కలైన్గా మారుతుంది. ఇది ఆహార పదార్థాలను కొంతసేపటి వరకు జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆహార పదార్థాల రుచిని నాలుక గుర్తించలేదు. టూత్పేస్ట్లో ఉండే కొన్ని కెమికల్స్ నోటి రుచిని తాత్కాలికంగా మార్చివేస్తాయి. అందుకే బ్రష్ చేసిన 10-15 నిమిషాల తర్వాత తినడం ఉత్తమం.

భారత యంగ్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ టెస్టుల్లో 40కి పైగా సెంచరీలు చేస్తారని ఆస్ట్రేలియన్ ప్లేయర్ మ్యాక్స్వెల్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా జట్టు అతడిని ఆపకుంటే ఈ సిరీస్ మరింత భయంకరంగా ఉంటుందన్నారు. భిన్న పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప సామర్థ్యాన్ని ఈ కుర్రాడు కలిగి ఉన్నాడని మ్యాక్సీ ప్రశంసించారు. ఇప్పటివరకు 15 టెస్టులు ఆడిన జైస్వాల్ 4 సెంచరీలు చేశారు. అన్నింట్లోనూ 150+ పరుగులు చేయడం గమనార్హం.

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సంతోష్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, రాహుల్ గాంధీ, మమతాతో సహా ఇండియా కూటమి నేతలు హాజరుకానున్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి మంత్రుల విషయమై క్లారిటీ వచ్చాక మంత్రివర్గం కొలువుదీరనుంది. JMMకు ఆరు, కాంగ్రెస్కు 4, రాష్ట్రీయ జనతా దళ్కు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

TG: డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ను ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మోదీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.

హీరో సూర్య కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య45’ పూజా కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సినిమాకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రానున్న ‘సూర్య 44’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కంగువా’ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

TG: ఇథనాల్ ఫ్యాక్టరీతో <<14729304>>తమకు ఎలాంటి సంబంధం లేదని<<>> మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉన్నత పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

రైళ్లలో ప్రయాణికులకు అందజేసే దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి ఉతుకుతున్నారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో వెల్లడించారు. బెడ్రోల్ కిట్లో మెత్తని కవర్గా ఉపయోగించేందుకు అదనపు బెడ్షీట్ను అందించినట్లు ఆయన తెలిపారు. రైల్మదద్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను పర్యవేక్షించడానికి రైల్వే జోనల్ హెడ్క్వార్టర్స్, డివిజనల్ స్థాయుల్లో ‘వార్ రూమ్లను’ ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.