India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడారు. ‘బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా హైపర్ ఎక్స్టెన్షన్తో ఉండటమే అతడి సక్సెస్కు కారణం. దానికి తన నైపుణ్యం కూడా తోడైంది. అలా బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేనైతే ఆ శైలిలో బౌలింగ్ ప్రయత్నించను. నా చేయి విరిగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు. ‘బడిమెట్లు ఎక్కిన బాల్యాన్ని ఆస్పత్రిలో చావు అంచున నిలిపినవ్. ఇది పేదల పిల్లలను పొడుచుకుతింటున్న రాబందు రాజ్యం. విషమ పరిస్థితిలో ఓ బిడ్డ 20 రోజులుగా తల్లడిల్లుతుంటే కనీసం పరామర్శించాలనే సోయి లేని సన్నాసి ప్రభుత్వమిది. ఈ విద్యార్థుల కన్నీళ్లు.. నీ రాక్షస పాలనకు సమాధిని నిర్మిస్తాయి’ అని ట్వీట్ చేశారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై సిట్ విచారణ ప్రారంభించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సీబీఐకి తుది నివేదిక ఇవ్వనుంది. ఈ బృందం తిరుపతి, తిరుమల, ఏఆర్ డెయిరీల్లో విచారణ చేయనుంది. నాలుగు టీమ్లుగా ఏర్పడి అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం సిట్ బృందానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.

రాజస్థాన్లో ఝున్ఝునూ జిల్లాకు చెందిన రోహితాశ్ ఓ అనాథ. అనారోగ్యంగా ఉన్నాడని షెల్టర్ హోమ్ సిబ్బంది నిన్న జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడు చనిపోయాడని చెప్పి పంచనామా చేసి పంపించేశారు. శ్మశానంలో చితికి నిప్పంటించే సమయానికి అతడు కదలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ICUలో కొన్ని గంటలపాటు బతికిన రోహితాశ్ తర్వాతి రోజు మరణించాడు. ఘటనలో ముగ్గురు వైద్యుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు.

AP: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ తమ పార్టీ ఎంపీలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఎంపీలకు సీఎం, పవన్ దిశానిర్దేశం చేశారు.

బౌన్సర్ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.

TG: దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు HYDలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయని ప్రభుత్వం తెలిపింది. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్యరహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొంది. 6 కంపెనీలు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని, వీటి ద్వారా 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది.

ఆప్ ప్రభుత్వంతో నిత్యం తగువుకు దిగే LG సక్సేనా మొదటి సారి CM ఆతిశీని ప్రశంసించారు. IGDT మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘లింగ భేదాన్ని నిలువరించి ఇతరులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి. ఈ రోజు ఢిల్లీ సీఎం మహిళ అయినందుకు సంతోషిస్తున్నా. గత పాలకుడి(కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు నయం’ అన్నారు. LG వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

భోజనం వేగంగా తినడం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు. తినే ఆహారం మాత్రమే కాదు, తినే విధానమూ ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. నిదానంగా భోజనం చేసే వారిలో డయాబెటిస్, PCOD, హై బీపీ వంటి సమస్యలు తక్కువని వివరిస్తున్నారు. తొందరగా తినే అలవాటు వల్ల జీర్ణకోశ సమస్యలు, అధిక బరువు, మెటబాలిజం సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి Relax and Eat. SHARE IT.

ఇప్పుడంటే ఆయుధాల కోసం అమెరికా వద్ద చేయి చాస్తోంది కానీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కొత్తలో ఉక్రెయిన్ వద్ద ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయుధ నిల్వలు ఉండేవి. 5వేలకు పైగా అణ్వాయుధాలు, 170కి పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వార్ హెడ్స్ వంటి వాటినన్నింటినీ 1996కల్లా రష్యాకు ఇచ్చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరి, అందుకు బదులుగా స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sorry, no posts matched your criteria.