India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఓ ఈవెంట్లో హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. కానీ దానికి సమయం ఉంది. అది నా పర్సనల్ మ్యాటర్. కాబట్టి ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలనుకోవడం లేదు. వివాహాన్ని నా ప్రొఫెషన్తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. ఆమె నటించిన ‘సబర్మతి రిపోర్ట్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక్కో జంతువు నోటి పట్టుకు ఒక్కో శక్తి ఉంటుంది. దీన్నే బైట్ ఫోర్స్ అంటారు. ఈ శక్తిని కొలిచేందుకు PSI అనే కొలమానాన్ని వాడతారు. నైలు నదిలో ఉండే మొసళ్లకు అత్యధికంగా 5000 పీఎస్ఐ పవర్ ఉంటుంది. వాటి తర్వాత ఉప్పునీటి మొసళ్లు(3700 PSI), అమెరికా మొసళ్లు(2125), హిప్పోపొటమస్(1800), జాగ్వార్(1500), బుల్ షార్క్(1350), గొరిల్లా(1300), ధ్రువపు ఎలుగుబంటి(1200 PSI) ఉన్నాయి. మనిషి బైట్ ఫోర్స్ 162 పీఎస్ఐ మాత్రమే!

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
తాత్పర్యం: బంగారపు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినా దాని బుద్ధిని విడిచిపెట్టదు. అలాగే హీనుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినా అతని బుద్ధి మారదు.

ఎటు చూసినా యుద్ధాలు, అశాంతి నెలకొన్న నేటి కాలంలో శాంతిభద్రతల్ని కలిగి ఉన్న దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ప్రశాంతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉన్నట్లు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన సూచీ తెలిపింది. దాని ప్రకారం.. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్, 4, 5 స్థానాల్లో స్వీడన్, జర్మనీ ఉన్నాయి. భారత్ 79వ ర్యాంకు దక్కించుకోగా చైనా 95, పాక్ 129వ స్థానాల్లో నిలిచాయి.

చెన్నై సూపర్ కింగ్స్లో ధోనీకి సరైన వారసుడు రిషభ్ పంతేనని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. ‘పంత్ గనుక ఢిల్లీని వదిలేసి వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు చెన్నై ఎంతవరకైనా వెళ్తుంది. ధోనీ తర్వాత సరైన ప్రత్యామ్నాయం అతడే. మరి రిషభ్ను ఢిల్లీ వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి’ అని పేర్కొన్నారు. తాను వేలంలోకి వస్తే ఎంత ధర వస్తుందంటూ పంత్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

TG: కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

✒ 1728: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జననం
✒ 1920: భారత మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జననం
✒ 1961: శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా
✒ 1977: శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర జననం
✒ 1984: భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
✒ 1987: ప్రముఖ గేయ రచయిత కొసరాజు మరణం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

TG: త్వరలోనే రాష్ట్రంలో బాంబు పేలుతుందని, గత ప్రభుత్వ ముఖ్యులంతా లోపలికి వెళతారని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలే పరస్పరం బాంబులు వేసుకుంటున్నారని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వేసే బాంబులు చాలవా అని ఎద్దేవా చేశారు. వీరి వ్యాఖ్యలు చూస్తుంటే 6 నెలల్లోనే ప్రభుత్వం పడిపోయేలా ఉందన్నారు.

AP: వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత కనిపించలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రస్తుతం ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం జగన్దేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మీద దాదాపు రూ.11వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. గతంలో ఏపీ జెన్కోను నిర్వీర్యం చేసి యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ను కొనుగోలు చేశారని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.