news

News April 23, 2025

టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

News April 23, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు: పొంగులేటి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చ.అ.లకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

News April 23, 2025

బాధితుల కుటుంబాలను ఆదుకోవాలి: రాహుల్ గాంధీ

image

పహల్గామ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, వారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని Xలో పోస్ట్ చేశారు.

News April 23, 2025

పవన్ కళ్యాణ్ ‘OG’ రిలీజ్ అప్పుడేనా?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు.

News April 23, 2025

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 43 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఆయన 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశారు. 18 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 167 మ్యాచుల్లో 10,100 రన్స్, 148 వికెట్స్ సాధించారు. ఆయన మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.

News April 23, 2025

ఉగ్రదాడి అనంతరం సరిహద్దుకు పాక్ విమానాలు?

image

పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని కరాచి నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ సరఫరా విమానాలు ఉత్తర సరిహద్దుకు చేరుకున్నాయని Xలో పోస్టుల వైరలవుతున్నాయి. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసింది. వీటిలో మిలిటరీ సామగ్రి తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సరిహద్దు జమ్ముాకశ్మీర్‌కు సమీపాన ఉంటుంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

News April 23, 2025

నేడు HYDకు సీఎం రేవంత్

image

TG: జపాన్‌లో సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఇవాళ ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈనెల 15న ఆయన జపాన్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో సుమారు రూ.12వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 30,500 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. HYDలో ఎకో టౌన్ అభివృద్ధికి జపాన్‌తో డీల్ కుదుర్చుకున్న సీఎం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఆ దేశంలోని రివర్ ఫ్రంట్‌లను పరిశీలించారు.

News April 23, 2025

BREAKING: ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి

image

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో <<16186510>>విశాఖ వాసి<<>> మృతి చెందారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళిని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. సహచర టూరిస్టులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చంపొద్దని వేడుకున్నా వదల్లేదని, పారిపోతుంటే వెంటాడి కాల్చి చంపారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పహల్‌గామ్ బయలుదేరారు.

News April 23, 2025

RECORD ఉష్ణోగ్రతలు.. బయటికెళ్లొద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న TGలోని ఆదిలాబాద్‌లో 44.3, నిజామాబాద్‌లో 44, APలోని నంద్యాల(D) దొర్నిపాడులో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే అత్యధికం. చాలాచోట్ల 40+ డిగ్రీలు రికార్డయ్యాయి. వడదెబ్బతో రోజూ మరణాలు సంభవిస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లొద్దని, పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 23, 2025

3 లక్షల గృహాలకు ప్రారంభోత్సవాలు.. ఎప్పుడంటే?

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12కు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది. పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు.