India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ టీజర్ లాంచ్ వేదికను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బాలానగర్లోని మైత్రీ విమల్ థియేటర్లో రిలీజ్ చేస్తారని సమాచారం. కాగా చిరు అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు.

TG: పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ విద్యపై దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. తాము విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు.

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో 81,381 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,964 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన సూచీలు ఏ దశలోనూ Day Highని క్రాస్ చేయలేదు. Trent, Hindalco, Hcl Tech, TechM, Ongc టాప్ గెయినర్స్. TCS, M&M, Icici, Cipla, AdaniEnt టాప్ టూజర్స్. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ సర్వీస్ రంగ షేర్లు నష్టపోయాయి.

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. రాత్రి 7గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు, 12 గంటల్లోపు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశముంది. బ్యాంకు DDలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అప్లై చేసుకోవచ్చు. కాగా నిన్న రాత్రి 8గంటల వరకు 65,629 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో 20 దరఖాస్తులు అమెరికా నుంచి రావడం గమనార్హం. నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో రూ.1312.58 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.

AP: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు 21 మంది జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.

మెంటల్ హెల్త్ హెల్ప్లైన్ టెలీ మానస్కు స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ గురించే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. 2022 అక్టోబర్ నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్కు 3.5 లక్షల కాల్స్ వచ్చాయి. వీటిని విశ్లేషిస్తే నిద్రా భంగం 14%, మూడ్ బాగాలేకపోవడం 14%, స్ట్రెస్ 11%, యాంగ్జైటీ 9% టాప్4లో ఉన్నాయి. సూసైడ్ కాల్స్ 3% కన్నా తక్కువే రావడం గమనార్హం. హెల్ప్లైన్కు పురుషులు 56%, 18-45 వయస్కులు 72% కాల్ చేశారు.

మైసూరుకు చెందిన మెకానిక్ అల్తాఫ్కు ₹25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని కుటుంబం సంతోషంలో తేలిపోతోంది. అతను 15 ఏళ్లుగా కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ కొంటున్నారు. ఈ ఏడాదీ ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు(ఒక్కోటి ₹500) కొనుగోలు చేశారు. తర్వాత ఓ టికెట్ను స్నేహితునికి ఇవ్వాలనుకోగా భార్య అతడిని ఆపింది. అదే టికెట్కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. ఆ టికెట్కే ₹25 కోట్ల బహుమతి దక్కింది.

AP: రాష్ట్రంలో ఇప్పటికే రెడ్ బుక్ యాక్షన్ స్టార్ట్ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ బుక్లో పేర్లు ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ‘విజయవాడ వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోకి ఇండస్ట్రీలు రాకుండా అడ్డుకునే వారిని వదలం. వైసీపీ తరిమేసిన పరిశ్రమలను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

బంగ్లాతో రెండో టీ20లో కుర్రాళ్ల ఆటతీరుతో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ‘మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రెజర్లో ఆడాలని, తమను తాము ఎక్స్ప్రెస్ చేసుకోవాలని కోరుకుంటా. రింకూ, నితీశ్, పరాగ్ మేం ఆశించినట్టే ఆడారు. వేర్వేరు సందర్భాల్లో బౌలర్లు భిన్నంగా ఎలా బౌలింగ్ చేస్తారో పరీక్షిస్తుంటాం. అందుకే కొన్నిసార్లు పాండ్య, సుందర్ బౌలింగ్ చేయరు’ అని అన్నారు.

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.