India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోల్కతా నైట్ రైడర్స్ తమ రిటెన్షన్ లిస్టును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాను రిటైన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రమణ్దీప్ సింగ్ను కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC కీలక ప్రకటన చేసింది. జనవరి 5న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని, దాదాపు లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే DSC, టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా జనవరి 5న పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC ప్రకటనలో వివరించింది.

ఆయుష్మాన్ భారత్లో ఢిల్లీ చేరకపోవడాన్ని PM మోదీ తప్పుబట్టడంపై ఆప్ స్పందించింది. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం పెద్ద స్కాం అని MP సంజయ్ సింగ్ విమర్శించారు. ఇందులోని నిబంధనల వల్ల ఒక్క ఢిల్లీ వ్యక్తికి కూడా పథకం వర్తించదన్నారు. ఫ్రిడ్జ్, స్కూటర్ ఉన్నా, ₹10 వేలకు పైగా ఆదాయం ఉంటే పథకం లబ్ధిపొందలేరని పేర్కొన్నారు. దర్యాప్తు జరిపితే పథకంలోని నిర్వహణ లోపం బయటపడుతుందన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

TG: పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.

TG: తనను ఎలా డీల్ చేయాలో తెలుసని CM రేవంత్ చేసిన కామెంట్స్పై హరీశ్రావు స్పందించారు. తనను డీల్ చేయడానికంటే ముందు సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకోవాలని హరీశ్రావు హితవు పలికారు. తాను ఫుట్బాల్ ఆటగాడినని చెప్పుకుంటున్న రేవంత్ వచ్చే ఎన్నికల్లో సెల్ఫ్గోల్ కొట్టుకోవడం తప్పదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఫుట్బాలర్ అయితే తాను క్రికెట్ ఆడుతానని, వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని జోస్యం చెప్పారు.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు డైరెక్షన్లో తెరకెక్కుతున్న తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీపై అప్డేట్ వచ్చేసింది. దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘మాస్ జాతర’ టైటిల్తో ‘మనదే ఇదంతా’ ట్యాగ్లైన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా 2025 మే 9న రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

AP: సీఎం చంద్రబాబు, కరవు కవల పిల్లలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని సంబంధం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని 54 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలో కరవు నీడలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం రైతుల కోసం పంటల బీమా పథకం అమలు చేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసింది. కూటమి సర్కార్ రైతుల ఉసురు తీస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

‘కంగువా’ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్(43) <<14487953>>మృతిపై <<>>తమిళ హీరో సూర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నిషాద్ ఇక లేరనే వార్త విని నా గుండె పగిలిపోయింది. మీరు ఎల్లప్పుడూ కంగువ జట్టులో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తుండిపోతారు. మా ఆలోచనలు, ప్రార్థనల్లో మీరు ఎప్పటికీ ఉంటారు. ఆయన కుటుంబానికి & స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

APCC చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈమేరకు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 2+2 గన్మెన్స్ స్థానంలో 4+4 సెక్యూరిటీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచాలని కాంగ్రెస్ కోరడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.